Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాస్తంత బియ్యం పిండి అలాగే కొంత మిల్క్ క్రీమ్ తీసుకోండి. ఈ రెండూ ముఖం మెరిసిపోవడానికి అద్భుతంగా పనిచేస్తాయి. ఇవి మంచి ఫేస్ స్క్రబ్లా కూడా ఉపయోగపడతాయి. ఒక టీస్పూన్ బియ్యం పిండిని తీసుకుని కాస్తంత మిల్క్ క్రీమ్ను కలపండి. ఆ తరువాత ముఖంపై, మెడపై ఈ మిశ్రమంతో సర్క్యూలర్ మోషన్లో మసాజ్ చేయండి. తర్వాత మీ ముఖాన్ని శుభ్రం చేసుకోండి.
- చిటికెడు పసుపును అలాగే శనగపిండిని కలపండి. చిక్కగా ఉన్న ఈ పేస్ట్తో ముఖంపై మసాజ్ చేసుకోవాలి. ముఖ్యంగా మొటిమలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్న ప్రాంతంలో కచ్చితంగా మసాజ్ చేయాలి. ఇది ముఖంపై నుంచి అదనపు నూనెను గ్రహిస్తుంది. మీ చర్మాన్ని హైడ్రేటెడ్గా, క్లీన్గా ఉంచుతుంది.
- మిల్క్ క్రీమ్ను కాస్తంత తేనెతో కలపండి. ముఖంపై అప్లై చేసుకోండి. కొద్ది సేపు ఆరనివ్వండి. కొన్ని నిమిషాల తరువాత నీటితో కడిగేయండి. బ్యూటీపార్లర్కు వెళ్ళినంత మెరుపు మీ ముఖంపై గమనిస్తారు.