Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా మహమ్మారి వల్ల పాఠశాలలు మూసివేశారు. దాంతో పిల్లలకు ఇప్పటికే ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయి. వీటికి మెల్లమెల్లగా పిల్లలు కూడా అలవాటు పడుతున్నారు. పాఠశాలకు వెళ్ళి చదువుకోవడానికి ఇంట్లోనే వుండి ఆన్లైన్ క్లాసులు వినడానికి చాలా తేడా ఉంటుంది. ఇలాంటి సమయం పిల్లలకూ, తల్లిదండ్రులకు కాస్త క్లిష్టమైనదే. కానీ తప్పని స్థితి. ముఖ్యంగా చిన్న తరగతుల పిల్లలకు ఇటువంటి సమయంలో తల్లిదండ్రుల సహకారం చాలా అవసరం. అందుకే ఆన్లైన్ తరగతుల సమయంలో పిల్లలు ఎలా వ్యవహరించాలి, తల్లిదండ్రులు వారికి ఎలాంటి సహకారం అందించాలి అనే విషయాలపై నిపుణులు కొన్ని సలహాలూ, సూచనలు ఇస్తున్నారు. అవేంటో ఈ రోజు తెలుసుకుందాం...
అవగాహన కల్పించాలి
పిల్లల దష్టిని క్లాసులు జరిగేటప్పుడు చదువుపైనా, టీచర్ చెప్పే పాఠాలపై కేంద్రీకరించేలా చూడాలి. సాధారణంగా ఇప్పటి వరకు పిల్లలకు ఫోన్ అంటే ఓ ఆడుకునే వస్తువుగా మాత్రమే తెలుసు. ఆటలకు పరిమితం ఉండదు. కానీ ఆన్లైన్ క్లాసులు మొదలైన తర్వాత ఫోన్ వాడకంలో మార్పు వచ్చింది అనే విషయం వారు గుర్తించేలా చేయాలి. ఫోన్ ద్వారానే వారు పాఠాలు వినాలి, నేర్చుకోవాలి అనే అవగాహన కల్పించాలి. క్లాసు టీచర్ చెప్పేటపుడు మాత్రమే వినే అవకాశం ఉంటుంది. ఆటలు ఎప్పుడైనా ఆడుకోవచ్చు. అనేది పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి.
పరిమితులు పెట్టాలి
పాఠశాలలో పిల్లల దష్టిని కేంద్రీకరించడానికి ఉపాధ్యాయులు అనేక చర్యలు తీసుకుంటారు. పిల్లలు చెప్పినదానిని తిరిగి చెప్పడం చాలా ముఖ్యం. ఇప్పుడు ఉపాధ్యాయులు ఆన్లైన్ పాఠం చేబుతున్నప్పుడు దీన్ని ఎలా ఆచరణలో పెట్టాలి. దీని కోసం పిల్లలు అనివార్యంగా కంప్యూటర్ స్క్రీన్పై దష్టి పెట్టాలి. దీని కోసమే నిపుణులు ఓ కొత్త పదం ఉపయోగిస్తున్నారు. అదే ''డిజిటల్ దిగ్బంధం''. అంటే పాఠశాల పాఠ్యాంశాలు పూర్తయ్యే వరకు పిల్లలు ఉపయోగించే కంప్యూటర్ పరికరాలు, ఇతర పరికరాలను పాఠం కోసం మాత్రమే కేటాయించాలి. విరామ సమయంలో, పిల్లలు తల్లిదండ్రుల అనుమతితో తమ ఇష్టమైన ఆట ఆడుకోవచ్చు. కానీ ఇది పరిమిత సమయం మాత్రమే అని స్పష్టంగా ఉండాలి.
ప్రత్యేక స్థలం
తల్లిదండ్రులు తమ పనులు చేసుకోవడానికి ఇంట్లో నిర్దిష్ట ప్రదేశాలు ఉన్నాయి. ఇదే విధంగా ఆన్లైన్ క్లాసులు వింటున్న మీ పిల్లల కోసం మీరు తగిన స్థలాన్ని ఏర్పాటు చేయడం చాలా అవసరం. అలాంటి అవకాశం కల్పిస్తే పిల్లలు నిశ్శబ్దంగా, సౌకర్యవంతంగా, అంకితభావంతో నేర్చుకోవటానికి కచ్చితంగా ఇష్టపడతారు. ఆ స్థలం వారు సాధారణంగా ఆటలు ఆడేవో, టీవీ చూసేవో కాకుండా వేరే వాతావరణంతో ఉండాలి.
కాస్త విరామం
పాఠశాలలో పిల్లలు చేసే పనులకు, వినే క్లాసులకు, ఆట లకు షెడ్యూల్ చాలా ముఖ్యమైనవి. ఇంట్లో కూడా సాధ్యమైనంత వరకు అలాంటి పరిస్థితులే వుండాలి. పిల్లలు వారి దినచర్య వీలైనంత ఎక్కువగా పాఠశాలలో ఉంటే పిల్లలు క్రమశిక్షణ నేర్చుకుంటారు. పాఠశాలలో ఏ సమయానికి ఏం చేయాలి అనేది స్పష్టంగా ఉంటుంది. సాధారణంగా భోజన సమయంలో పిల్లలు క్లాసు రూము నుండి బయటకు వచ్చి రిలాక్స్ అవుతారు. అటూ ఇటూ నడవడం, తినడం, ఆడుకోవడం వల్ల బద్దకాన్ని వదిలించుకొని కొత్త ఉత్సాహాన్ని పొందుతారు. ఇంట్లో కూడా పిల్లలకు అలాంటి వాతావరణాన్ని కల్పించే ప్రయత్నం చేయాలి.
గందరగోళ పడకుండా
పాఠశాల నుండి పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను గుర్తుచేసుకుంటూ నేర్చుకుంటారు. ఎమైనా అనుమానాలు ఉంటే టీచర్లను అడిగి నివృత్తి చేసుకుంటారు. ఇప్పుడు ఒకే సారి వినడం, నేర్చుకోవడం, అది కూడా స్క్రీన్పైనే కావడం వల్ల పిల్లలు గందరగోళంలో పడటం ఖాయం. అందుకే పుస్తకాలు పిల్లలకు అందుబాటులో ఉంచాలి. పాఠాలు విన్న తర్వాత టెక్ట్స్ పుస్తకంలో చూసి చదువుతూ నేర్చుకుంటారు. ఎక్కువ సేపు స్క్రీన్ చూడడం కండ్లకు అంత మంచిది కాదు. అందుకే పుస్తకాలు చదవమని పిల్లలను ప్రోత్సహించాలి.
ఇతర పిల్లల తల్లిదండ్రులతో సన్నిహితంగా
ప్రస్తుత కరోనా సమయంలో వ్యక్తులను ప్రత్యేక్షంగా కలిసే అవకాశం లేదు. కానీ టెక్నాలజీ ద్వారా కమ్యూనికేట్ చేయడం, ఇతరులతో సన్నిహితంగా ఉండటం కూడా చాలా ముఖ్యం. ప్రస్తుతం ఇంట్లో పిల్లలు ఉన్న ప్రతి తల్లిదండ్రులు కొత్త అనుభవాన్ని పొందుతున్నారు. ఇతర తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎలాంటి సహకారం అందిస్తున్నారు, ఆ పిల్లలు తరగతులు ఎలా వింటున్నారు లాంటి విషయాలు చర్చించుకుంటూ ఉంటే అవి మీకూ సహాయపడతాయి.
ప్రణాళిక అవసరం
తల్లిదండ్రులు కూడా ఇంటి నుండే వర్క్ చేస్తుంటే మరింత జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. అలాంటప్పుడు మీ పనికీ, మీ పిల్లల పనికి ఓ ప్రణాళిక ఏర్పాటు చేసు కోవడం చాలా ముఖ్యం. సాధారణంగా పిల్లలు పాఠశా లకు వెళ్ళే సమయంలోనే ఆన్లైన్ పాఠాలు తీసుకో వాలని విద్యా వేత్తలు సలహా ఇస్తున్నారు. కాబట్టి ఆ సమయంలో పిల్లలకు కూడా మీరు కొంత సమయం తప్పక కేటాయించాల్సి వస్తుంది. ఒక వేళ ఉపాధ్యా యులు షెడ్యూల్ ఇవ్వకపోతే మీరు పిల్లలకు సహక రించండి. పిల్లలు ఇంట్లో ఉంటున్నారు కాబట్టి వారికి పనే లేదని, అలసిపోరని అనుకోకండి. పెద్దలకు ఎలాగైతే ఉంటాయో అలాగే పిల్లలకు కూడా వారి సొంత ప్రాధాన్యతలు, లక్ష్యాలు, పనులు నేర్చుకోవాలి.
పదే పదే గుర్తు చేయాలి
ఇంట్లో ఉన్నారు కాబట్టి పిల్లలు సాధారణంగా సెలవులుగా భావిస్తారు. అయితే ఇవి సెలవులు కావని తెలియజేయాలి. ఇంట్లో ఉంటే పిల్లలు పాఠాల గురించి అంత సీరియస్గా తీసు కోరు. సరదాగా గడిపేస్తారు. ఇది సర్వ సాధారణం. అయితే పాఠశాల లేకపో వడం వల్ల ఇంట్లోనే పాఠాలు నేర్చు కోవాల్సిన అవసరం ఉందని వారికి పదేపదే గుర్తు చేయడం ముఖ్యం. అలాగే పరీక్షలు ఉంటాయిని వాటిని కూడా భవిష్యత్లో రాయాల్సి వుంటుందని వారికి తెలియజేయాలి.
వినోదం కోసం...
ఇంట్లో పిల్లలతో సరదాగా గడపడం చాలా ముఖ్యం. ఉద్యోగం చేసే తల్లిదండ్రులు పిల్లలతో ఎక్కువ సమయం గడపడం చాలా కుదరదు. ప్రస్తుతం ఇంటి నుండే మీరూ ఉద్యోగం చేస్తుంటే... పిల్ల లతో కలిసిపోయే అవకాశాన్ని ఇప్పుడు ఉపయోగించుకోండి. పిల్లలతో కలిసి పెద్దలు ఆటలు ఆడాలని, వాకింగ్ లాంటివి చేయాలని నిపు ణులు సూచిస్తున్నారు.