Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మన శరీరంలో అన్ని అవయవాలూ ముఖ్యమైనవే. ప్రధానంగా గుండె, కిడ్నీలు, లివర్ వంటివి అత్యంత ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అయితే అవి ఆరోగ్యంగా ఉన్నాయో లేదో మనకు తెలీదు. ఎందుకంటే మన చేతులూ, కాళ్లలాగా అవి మన కంటికి కనిపించవు కదా. కాబట్టి వాటి విషయంలో మనం శ్రద్ధ పెట్టుకోవాలి. మంచి ఆహారం తినాలి. ఎక్కువ పోషకాలు, విటమిన్లూ, ఖనిజాలు ఉండే ఆహారం తీసుకోవాలి. కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా బీపీ, షుగర్ వంటివి ఉండేవారు ఇంకా ఎక్కువ జాగ్రత్తలు పాటించాలి. అధిక బరువు ఉండేవారికి కూడా గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువ. అందువల్ల గుండె విషయంలో అందరమూ జాగ్రత్త పడదాం. అందుకు ఏం చెయ్యాలో తెలుసుకుందాం.
ఎంత తింటున్నామో గమనించుకోవాలి : జపనీయులు చిన్న గిన్నెల్లో ఆహారం తింటారు. ఎందుకంటే చిన్న ప్లేట్లు, గిన్నెల్లో తక్కువ ఆహారం పడుతుంది. కానీ అవి నిండుగా కనిపిస్తాయి. అందువల్ల అలాంటి వాటిలో తింటే మంచిది. కొంత మంది భోజనం చేసినా మళ్లీ చిరుతిళ్ల వంటివి తింటారు. అలా చెయ్యకూడదు. కావాలంటే భోజనం కొద్ది కొద్దిగా రెండు సార్లు తినడం మంచిది. ప్రతీ రెండు గంటలకు ఓసారి ఎంతో కొంత ఏదో ఒకటి తినాలి. కానీ భోజనం వంటివి మరీ ఎక్కువ తినకుండా జాగ్రత్త పడాలి.
కొవ్వు పదార్థాలు తగ్గించుకోవాలి : వేపుళ్లు, కేకులు, చాకొలెట్లు, స్వీట్లు, కూల్ డ్రింక్స్ ఇవన్నీ రుచిగా ఉంటాయి. కానీ వీటిలో కొవ్వు ఎక్కువ. అది మన గుండెకు ప్రమాదకరం. ఇవి ఎక్కువగా తింటే మన రక్తంలో కొవ్వు శాతం పెరుగుతుంది. ఇది రక్తాన్ని సరఫరా చేసే ధమనులు, సిరల్లో గడ్డలుగా గూడుకడుతుంది. ఏదో ఒక రోజు అదే కొవ్వు రక్త సరఫరాను అడ్డుకుంటుంది. అంతే హార్ట్ ఎటాక్ వచ్చేస్తుంది. అందు వల్ల ప్రమాదకరమైన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. అవసరమైతే నోరు కట్టేసుకోవాలి. అప్పుడప్పుడూ తింటే పర్లేదు గానీ రోజూ అలాంటివి తింటే గుండెకు చేటే.
ప్రోటీన్స్ ఎక్కువ ఉండొచ్చు : మాంసం, చికెన్, చేపలు, గుడ్ల వంటివి ప్రోటీన్స్ (మాంసకత్తులు) ఎక్కువగా ఉండే ఆహారాలు. ఐతే ఈ ఫుడ్లో కూడా బీఫ్ అయితే కొవ్వు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల దాని బదులు చికెన్, మటన్ వంటివి తినడం బెటర్. చేపలు మంచివి. వాటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అవి కొవ్వు తగ్గిస్తాయి. గింజలు, బఠాణీలు, పల్లీలు వంటివి కూడా కొద్ది మొత్తాల్లో తీసుకుంటే మేలు.
తణ ధాన్యాలు తప్పనిసరి : బియ్యం, గోధుమలతో పాటూ రాగులు, జొన్నలు, సజ్జల వంటివి ఈమధ్య కాలంలో ప్రజలు ఎక్కువగా తీసుకుంటున్నారు. నిజానికి అవి అన్నీ తినాలి కూడా. ఇక వాటిలోనూ ఇప్పుడు ఆర్గానిక్ ఫుడ్ వచ్చేసింది. అది రేటు ఎక్కువైనా మన శరీరానికి చాలా మంచిదే. ఇలా మనం తినే వాటిలో బ్యాలెన్స్డ్ ఫుడ్ ఉండేలా చేసుకోవాలి. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం కదా. ఒక్కసారి బాడీలో ఏదైనా పార్ట్ పాడైతే ఇక మనకు కలిగే బాధ అంతా ఇంతా కాదు. ముందే జాగ్రత్త పడాల్సిందే అని అప్పుడు ఎంతో ఫీల్ అవుతాం. ఈ పరిస్థితి రాకుండా చేసుకుందాం. ముందే జాగ్రత్త పడదాం.
ఆకుకూరలు, కూరగాయలు : మనం తినే ఆహారాల్లో మతం, అమతం అని రెండు రకాలుంటాయి. డీప్ ఫ్రై చేసే ఆహారం మత ఆహారం. అది తినడం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువ. అదే ఆకు కూరలు, కూరగాయలు, కాయలు, పండ్ల వంటివి మతం కాని అమత ఆహారం. అవి ఎంత తింటే అంత మన శరీరానికి మేలు జరుగుతుంది. ఈ ఫార్ములాను పక్కాగా ఫాలో అయిపోండి. అమతాహారంలో పోషకాలు ఎక్కువ, కొవ్వు తక్కువ. అందువల్ల అవి తింటే గుండె ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది.