Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పెరుగు తినడానికి మాత్రమే కాదు.. పలు రకాల చర్మ సమస్యలను పరిష్కరించడంలోనూ ఓ మ్యాజిక్లా పనిచేస్తుంది. మీ ముఖ చర్మం ప్రకాశవంతంగా మెరిసిపోవాలంటే ఓ సారి పెరుగు ఫేస్ ప్యాక్ను ట్రై చేయండి.
- టీ స్పూన్ పెరుగు, ఒక అరటిపండు, రెండు టీస్పూన్ రోజ్ వాటర్.. ఈ మూడింటిన ఒకటిగా చేర్చి ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేసుకోండి. 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో మీ ముఖాన్ని శుభ్రం చేసుకోండి.
- ఒకవేళ మీకు జిడ్డు చర్మం ఉన్నట్లయితే... పెరుగు రెండు టీస్పూన్లు, తేనె టీ టీస్పూన్, నిమ్మకాయ రసం ఒక టీస్పూన్స్ ఓ బౌల్లో తీసుకుని పేస్ట్లా తయారు చేయడండి. ఇలా తయారైన మిశ్రమాన్ని ముఖం, మెడ భాగంలో అప్లై చేయండి. 15 నిమిషాల తర్వాత కొద్దిగా నీరు చల్లి నెమ్మదిగా రబ్ చేస్తూ చల్లని నీటిలో కడిగేయాలి.
- పెరుగుతో తయారుచేసిన ఈ రెండు ఫేస్ ప్యాక్లను వారంలో రెండు సార్లు చేస్తూ వస్తే మొటిమలతో పాటు ముఖంపై ఉండే ఇతర మచ్చలను కూడా తగ్గిస్తుంది. కొన్ని వారాల పాటు దీన్ని ట్రై చేస్తే మత చర్మ కణాలు పోయి మీ చర్మం నేచురల్గా అందంగా... ఆరోగ్యవంతంగా తయారవుతుంది.