Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓ బౌల్లో కొద్దిగా బొప్పాయి పండు గుజ్జు తీసుకోవాలి. ఇందులో ముల్తానీ మట్టిని కలిపి ప్యాక్లా వేసుకోవాలి ఈ ప్యాక్ ఆరుతు న్నట్లుగా అనిపించినప్పుడు కొన్ని నీళ్లు చల్లుకుని మర్దనా చేస్తూ ప్యాక్ని తొలగించాలి. కొంతమందికి ముల్తానీ మట్టి పడదు. అలాంటి వారు.. శనగపిండిని వాడొచ్చు.
- బొప్పాయి గుజ్జులో, అలోవెరా జెల్ని కలిపి ముఖం, మెడకు రాయాలి. కాసేపు ఆరిన తర్వాత నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. బొప్పాయిలో ఉండే విటమిన్స్ శరీరంలోని మృతకణాలను తొలగించి కాంతివంతంగా, తాజాగా మారుస్తుంది.
- శనగపిండిలో రోజ్వాటర్ లేదా పాలని కలిపి పేస్ట్లా చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై రాసి ఆరిన తర్వాత కడిగేయాలి.
- ఇలాంటి సహజ సిద్ధమైన ఫేస్ప్యాక్స్ వల్ల చర్మంపై ఎలాంటి హానీ కలగదు. అంతే కాకుండా.. చక్కని ఫలితం కూడా ఉంటుంది.