Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోజూ రెండు అంజీర్ పండ్లను భోజనానికి ముందు తిన్నట్టయితే వారిలో రక్తం బాగా పడుతుంది. హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి.
- అంజీరలో ఉండే పీచుపదార్ధం మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ను కరిగించి మంచి కొలెస్ట్రాల్ను పెంచుతుంది.
- సరిగ్గా నిద్రలేని వారు రాత్రి ఏడు గంటల తరువాత మూడు అంజీరపు పళ్ళు తిని, పాలు తాగితే చక్కగా నిద్ర పడుతుంది.
- రోజూ రెండు పళ్ళు తింటే మొటిమలు తగ్గి ఆకర్షణీయంగా తయారవుతారు.
- 3-4 అంజీరలను నానబెట్టి తలకు మర్దన చేయటం వల్ల తలలోని చుండ్రు పోతుంది.
- కఫం, దగ్గుతో పాటు, శ్వాసకోశ పరమైన ఇబ్బందులు, ఉబ్బసం వంటి సమస్యల నుంచి చక్కని ఉపశమాన్ని ఇచ్చేవి ఎండు అంజీర పండ్లు. ఒకటి రెండు పండ్లను రెండు గంటల పాటు నీళ్లల్లో నానబెట్టి, ఆ తర్వాత గ్లాసు పాలల్లో వేసి మరిగించి రోజుకు రెండు పూటలా సేవిస్తే చాలా త్వరగా ఉపశమనం పొందవచ్చు.
- కండ్లు పొడిబారిపోయి, దురద, మంట ఉన్నవారు విటమిన్ ఏ సమద్ధిగా ఉండే అంజీర పండ్లు తీసుకోవడం వల్ల సమస్యలు చాలావరకు తగ్గుతాయి.
- ఎండు అంజీరాలలో ఫెనాల్, ఒమేగ 3, ఒమెగ 6 ఫ్యాటీ ఆసిడ్స్ చాలాఎక్కువగా ఉన్నాయి. అందువల్ల గుండె జబ్బుల రిస్క్ నుండి బయట పడవచ్చు.
- చాలామందికి శారీరక బలహీనతవల్ల నోటిలో పుండ్లు, పెదవుల పగుళ్లు, నాలుకు మంట వంటివి ఇబ్బంది పెడుతుంటాయి. అలాంటి వారికి అంజీర ఎంతో ఉపయోగపడతాయి.