Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాల యానికి చెందిన ఎమ్మాన్యుల్ షార్పెంటైర్... (51), అమెరికన్ బయోకెమిస్ట్ జెన్నిఫర్ డౌడ్నా(56)లకు ''జన్యు సంకలనం కోసం ఒక పద్ధతిని అభివద్ధి చేసినందుకు'' రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. జన్యువులను మనకు అవసరమైన రీతిలో కచ్చితంగా కత్తిరించేందుకు 'క్రిస్పర్ క్యాస్-9' అనే నూతన పద్ధతి(జెనెటిక్ సిజర్స్)ని ఆవిష్కరించినందుకు వీరిద్దరికి ఈ బహుమతి లభించింది. రసాయన శాస్త్ర నోబెల్ను ఇద్దరు మహిళలు పంచుకోవడం ఇదే తొలిసారి.
ఎమ్మాన్యుల్ షార్పెంటైర్...
1968, డిసెంబర్ 11న ఫ్రాన్స్లోని సుర్-ఓర్గేలో జన్మించారు. ఈమె ఫ్రెంచ్ ప్రొఫెసర్. అలాగే మైక్రోబయాలజీ, జెనెటిక్స్ అండ్ బయోకెమిస్ట్రీలో పరిశోధకురాలు. చార్పెంటియర్ పారిస్లోని పియరీ, మేరీ క్యూరీ విశ్వవిద్యాలయంలో (నేడు ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ ఆఫ్ సోర్బొన్నే విశ్వవిద్యాలయం) బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, జన్యుశాస్త్రాలను అభ్యసించారు. 1992 నుండి 1995 వరకు ఇనిస్టిట్యూట్ పాశ్చర్లో గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. అక్కడి నుండే పరిశోధనా డాక్టరేట్ పొందారు. చార్పెంటియర్ పీహెచ్డీ ప్రాజెక్ట్ ద్వారా యాంటీబయాటిక్ నిరోధకతతో సంబంధం ఉన్న పరమాణు విధానాలను పరిశోధించారు. 2015 నుండి ఆమె బెర్లిన్లోని మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇన్ఫెక్షన్ బయాలజీలో డైరెక్టర్గా పని చేస్తున్నారు. 2018లో మాక్స్ ప్లాంక్ యూనిట్ ఫర్ ది సైన్స్ ఆఫ్ పాథోజెన్స్ అనే సొంత పరిశోధనా సంస్థను స్థాపించారు.
జెన్నిఫర్ అన్నే డౌడ్నా...
ఫిబ్రవరి 19, 1964లో జెన్నిఫర్ అన్నే డౌడ్నా పుట్టారు. డౌడ్నా హవాయిలోని హిలోలో పెరిగారు. ఆమె 1985లో పోమోనా కాలేజీ నుండి పట్టభద్రురాలై పిహెచ్.డి. పూర్తి చేశారు. బయోకెమిస్ట్, జన్యు సవరణలో కషికి ప్రసిద్ది చెందారు. ఈ కృషికి గాను ఈమెకు ఇమ్మాన్యుల్లె చార్పెంటియర్తో కలపి రసాయన శాస్త్రంలో 2020 నోబెల్ బహుమతి లభించింది. ఆమె కెమిస్ట్రీ విభాగంలో లి కా షింగ్ ఛాన్సలర్ చైర్ ప్రొఫెసర్గా అలాగే బర్కిలీలోని కాలి ఫోర్నియా విశ్వవిద్యాలయంలో మాలి క్యులర్ అండ్ సెల్ బయాలజీ విభాగం లో ఉన్నారు. ఆమె 1997 నుండి హౌ వార్డ్ హ్యూస్ మెడికల్ ఇనిస్టిట్యూట్లో పరిశోధకురాలిగా కూడా పని చేశారు.
అద్భుతమైన ఫలితాలు
మనిషికి విపరీతమైన హాని కలిగించే స్ట్రెప్టోకాకస్ పయోజీన్స్ బ్యాక్టీరియాపై పరిశోధనలు చేస్తున్న క్రమంలో ఎమ్మాన్యుల్ షార్పెంటైర్ అందులో అప్పటివరకూ గుర్తించని ఓ అణువు ఉన్నట్టు గుర్తించారు. ఈ ట్రాకర్ఆర్ఎన్ఏ పురాతన బ్యాక్టీరియా రోగ నిరోధక వ్యవస్థలో భాగమని తెలిసింది. దీనిపై 2011లో షార్పెంటైర్ తన పరిశోధన పత్రాన్ని సమర్పించారు. అదే ఏడాది ఆర్ఎన్ఏపై అనుభవమున్న జెన్నిఫర్తో కలిసి పరిశోధనలు చేపట్టారు. ఇరువురూ ఆ ప్రక్రియను కత్రిమంగా అభివద్ధి చేసే ప్రయత్నం చేసి విజయం సాధించారు. సులువుగా పనిచేసేలా, ఏ రకమైన జన్యు పదార్థంతోనైనా పనిచేసేలా మార్చారు. అవసరమైతే మనుషు లతోపాటు జంతువులు, మొక్కల జన్యువుల్లోనూ మార్పులు చేసేలా అన్నమాట. డీఎన్ఏ పోగులను అవసరమైనట్లుగా కత్తిరించడంతో పాటు జోడించే శక్తినీ ఈ పద్ధతికి వీరు చేర్చారు. 2012లో క్రిస్పర్ క్యాస్-9 పద్ధతిని ఈ ఇద్దరు శాస్త్రవేత్తలు ఆవిష్కరించగా.. శాస్త్రవేత్తలు ఇప్పటికే దీనిద్వారా ఎన్నో అద్భుతమైన ఫలితాలు రాబట్టగలిగారు.