Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నోబెల్ బహుమతుల ఎంపికలో మహిళలు అరుదుగా కనిపిస్తుంటారు. స్వీడన్కు చెందిన ప్రముఖ శాస్త్రవేత ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీద 1901 నుంచి నోబెల్ బహుమతులను ప్రకటిస్తున్నారు. నేటివరకు వివిధ రంగాల్లో విశేష కషి చేసిన వారికి 867 అవార్డులు ఇచ్చారు. మొత్తం అవార్డుల్లో మహిళలకు లభించినవి 46 మాత్రమే. 1964లో బ్రిటీష్ కెమిస్ట్ డొర్తి క్రోఫూట్ హాడ్కిన్ కెమిస్ట్రీలో నోబెల్ను పొందిన తర్వాత మళ్ళీ 50 ఏండ్లకు 2014లో మలాలా ఎంపికైంది. 2020లో మాత్రం సాహిత్య విభాగం నుండి లూయిసీ గ్లుక్, భౌతిక శాస్త్ర విభాగం నుండి ఆండ్రియా గేజ్, రసాయన శాస్త్ర విభాగం నుండి షార్పెంటైర్... జెన్నిఫర్ డౌడ్నా.. ఇలా నలుగురు మహిళలు ఎంపికయ్యారు.
అతి తక్కువ కాలంలోనే...
హంగేరియన్-యూదు మూలాలున్న లూయిసీ గ్లుక్ 1943, ఏప్రిల్ 22న న్యూయా ర్క్లో జన్మించారు. ప్రస్తుతం ఈమె కనెక్టికట్లోని యేల్ యూనివర్సిటీ ఫ్యాకల్టీగా పని చేస్తున్నారు. 1968లో 'ఫస్ట్బోర్న్' పేరుతో మొట్టమొదటి కవిత రాసిన ఆమె అతి తక్కువ కాలంలోనే సమకాలీన అమెరికా సాహిత్యంలో ప్రముఖ కవయిత్రిగా పేరు సంపాదించుకున్నారు. ఇప్పటి వరకు డిసెండింగ్ ఫిగర్స్, ది ట్రయంఫ్ ఆఫ్ అచిల్స్, అరారట్ వంటి 12 కవితా సంకలనాలను, రెండు వ్యాస సంకలనాలను గ్లుక్ రచించారు.
పురస్కారాలు
నేషనల్ హ్యుమానిటీ మెడల్(2015), అమెరి కన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స అండ్ లెటర్స్ గోల్డ్ మెడల్
'ది వైల్డ్ ఐరిస్' కవితకు పులిట్జర్ ప్రైజ్(1993), 'ఫెయిత్ఫుల్ అండ్ విర్చువస్ నైట్' కవితకు నేషనల్ బుక్ అవార్డు(2014), 2003, 2004 సంవత్సరాల్లో 'యూఎస్ పోయెట్ లారియేట్' పురస్కారాలను అందుకున్నారు.
విలక్షణ కవయిత్రి గ్లుక్
తన కవితల్లో.. కుటుంబ జీవితం లోని కష్టానష్టాలను సైతం హాస్యం, చమత్కారం కలగలిపి రచించిన విలక్షణ కవయిత్రి లూయిసీ గ్లుక్' సాహిత్య విభా గంలో 2020 నోబెల్ బహుమతికి ఎంపికయ్యారు. 2006లో ఈమె రచించిన 'అవెర్నో' కవితా సంక లనం అత్యుత్తమ మైందని నోబెల్ సాహిత్య కమిటీ చైర్మన్ ఆండెర్స్ ఒల్సన్ అన్నారు. 1991 నుంచి ఇప్పటివరకు సాహిత్య రంగంలో 117 మంది నోబెల్ ఇవ్వగా వీరిలో మహిళలు 16 మంది మాత్రమే ఉన్నారు.
మూడు వేల నక్షత్రాలను అధ్యయనం చేశారు
2020లో భౌతిక శాస్త్ర విభాగంలో నోబెల్ బహుమతి గెలుచుకున్న కాలిఫోర్నియా విశ్వ విద్యాలయంలోని ఆస్ట్రోఫిజిక్స్ ప్రొఫెసర్ ఆండ్రియా గేజ్. నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు. అక్టోబర్ 6న రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ కమిటీ ఈ బహుమతి పొందిన విజేతలను ప్రకటించింది. ''అత్యంత ఆధునిక సాంకేతిక మార్గాల సహాయంతో విశ్వం గురించి తెలుసుకోవడానికి చాలా ఉంది. నోబెల్ బహుమతి అద్భుతమైనది. అయినప్పటికీ, విశ్వం ఎలా పనిచేస్తుందనే దానిపై మనకున్న అవగాహన ఇంకా చాలా అసంపూర్ణంగా ఉంది. అందుకే ఇంకా చాలా నేర్చుకోవలసి ఉంది'' అంటున్నారు గేజ్.
ఆండ్రియా గెజ్తో తన సహచరులైన రోజర్ పెన్రోజ్(బ్రిటన్), రైన్హార్డ్ గెంజెల్(జర్మనీ)తో కలసి సూపర్ మాసివ్ కాల రంధ్రం సమీపంలో 3 వేలకు పైగా నక్షత్రాలను అధ్యయనం చేశారు. ఈ అంతరిక్ష వస్తువు గురుత్వాకర్షణ ప్రభావాన్ని అంచనా వేశారు. ఈ అధ్యయనాలు ఖగోళ భౌతిక అభివద్ధిలో చాలా ముందు వరుసలో ఉన్నాయని గేజ్ అంటున్నారు. 2005లో తన సహౌద్యోగులతో కలిసి పాలపుంత గెలాక్సీ మధ్య ప్రాంతంలోని మొదటి స్పష్టమైన చిత్రాన్ని ఆమె కనుగొన్నారు.