Authorization
Mon Jan 19, 2015 06:51 pm
త్వరలో జరగబోయే అమెరికా అద్యóక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ తరఫున కమలా హ్యారిస్ ఉపాధ్యక్ష పదవికి పోటీ చేయబోతున్నారు. ఈ పదవికి పోటీ చేస్తున్న తొలి నల్లజాతి మహిళ, ఆసియా అమెరికన్ ఈమెనే కావడం విశేషం. అమెరికాలోని నల్లజాతి రాజకీయ నేతల్లో కమలా ప్రముఖురాలు. అయితే, ఆమెకు భారత్ మూలాలు కూడా ఉన్నాయి. దీని గురించి ఆమె ఎంతో గర్వంగా చెబుతుంటారు. అమెరికా ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న మొట్టమొదటి మహిళగా చరిత్ర సృష్టింన ఆమె జన్మదినం నేడు. ఈ సందర్భంగా ఆమె గురించి మరిన్ని విశేషాలు...
కమలా హ్యారిస్... శ్యామల గోపాలన్, డోనల్డ్ హారిస్ దంపతులకు 1964 అక్టోబర్ 20న కాలిఫోర్నియాలోని ఆక్లండ్లో జన్మించారు. కమలా తల్లి తమిళనాడులోని చెన్నైలో జన్మించారు. తండ్రి జమైకాలో పుట్టారు. కమలాకు ఓ చెల్లెలు ఉంది. ఆమె పేరు మాయా. చిన్నప్పుడు వారి ఇంట్లో ఎప్పుడూ నల్ల జాతి అమెరికన్ గాయకుల సంగీతం వినిపిస్తూ ఉండేది. కమలా తండ్రి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్. తల్లి క్యాన్సర్ పరిశోధకురాలు, అలాగే పౌర హక్కుల కార్యకర్త. కమలాకు ఐదేండ్ల వయసు ఉన్నప్పుడే ఆమె తల్లిదండ్రులు విడిపోయారు. ఇద్దరు ఆడపిల్లలను శ్యామల ఒంటరిగానే పెంచారు. ఆ ముగ్గురినీ కలిపి వారికి తెలిసినవాళ్లు 'శ్యామల అండ్ ద గర్ల్స్' అని పిలిచేవారంట.
ఆఫ్రికన్ అమెరికన్గా గర్వపడతారు
కమలా, మాయాలకు తల్లి వారి నేపథ్యాన్ని ఎప్పుడూ గుర్తు చేస్తూ ఉండేవారు. ''ఇద్దరు నల్ల జాతి అమ్మాయిలను పెంచుతున్నానని మా అమ్మ బాగా అర్థం చేసుకున్నారు. మాయాను, నన్ను తన కొత్త దేశం నల్ల జాతి అమ్మాయిలుగానే గుర్తిస్తుందని ఆమెకు తెలుసు. అందుకే.. మాలో ఆత్మవిశ్వాసాన్ని ఆమె నూరిపోశారు'' అని కమలా తన ఆత్మకథలో రాశారు. కమలా హారిస్ భారత సంస్కతిని ఆకళింపు చేసుకుంటూ పెరిగారు. అయితే ఇప్పుడు ఓ ఆఫ్రికన్ అమెరికన్గా ఆమె గర్వంగా జీవిస్తున్నారు'' అని గత ఏడాది వాషింగ్టన్ పోస్ట్ ఓ కథనం రాసింది.
అటార్నీ జనరల్గా తొలిమహిళ
2015లో సెనేట్కు కమలా పోటీ చేసినప్పుడు... ఆమెను 'భారతీయ క్యాన్సర్ పరిశోధకురాలు, జమైకన్ ప్రొఫెసర్ల కూతురు'గా ఎకనామిస్ట్ మ్యాగజైన్ వర్ణించింది. కాలిఫోర్నియా అటార్నీ జనరల్ పదవి చేపట్టిన తొలి మహిళ, తొలి ఆఫ్రికన్ అమెరికన్, తొలి ఏసియన్ అమెరికన్ కమలా హారిస్. అయితే, తన గుర్తింపు విషయంలో కమలాకు మాత్రం ఎలాంటి అయోమయం లేదు. తనను తాను కేవలం 'ఓ అమెరికన్'గా ఆమె వర్ణించుకుంటారు.
భారతీయ వంటలే తినేవాళ్ళం
భారత సంతతి కమెడియన్ మిండీ కలింగ్తో కలిసి ఓ కుకింగ్ వీడియోలో కమలా కనిపించారు. భారతీయ వంటకాన్ని వండుతూ, తమ దక్షిణ భారత నేపథ్యం గురించి ఇందులో వీళ్లిద్దరూ పంచుకున్నారు. కమల తన యూట్యూబ్ పేజీలో ఈ వీడియోను పోస్ట్ చేశారు. మీకు భారతీయ వంటలతో పరిచయం ఉందా అని అడిగిన ప్రశ్నకు ''అన్నం, పెరుగు, ఆలుగడ్డ కూర, పప్పు, ఇడ్లీ'' అంటూ చిన్నప్పుడు తాను ఇంట్లో తిన్న వంటల గురించి వివరించారు కమలా. ''నేను భారత్లో అమ్మమ్మ వాళ్ల ఇంటికి వెళ్తుండేదాన్ని. మా అమ్మమ్మ శాకాహారి. ఆమె ఎటైనా వెళ్లిన ప్పుడు, గుడ్లతో ఫ్రెంచ్ టోస్ట్ చేసు కుందామని మా తాతయ్య అడుగుతుండేవారు'' అని కమలా చిన్ననాటి విష యాలను గుర్తు చేసుకు న్నారు. తమ ఇంట్లో బిర్యానీ కూడా చేసుకునే వాళ్లమని కమలా తన పుస్తకంలో రాశారు.
జాతి విద్వేషానికి వ్యతిరేకంగా
కమలా హ్యారిస్ 2014లో డగ్లస్ ఎమ్హోఫ్ అనే న్యాయవాదిని పెళ్లాడారు. డగ్లస్ యూదుడు. భారతీయ, యూదు సంప్రదాయ పద్ధతిలో ఆమె వివాహం జరిగింది. ఈమెను ఎక్కువగా నల్లజాతి అమెరికన్ రాజకీయ నేతగానే అక్కడివారు చూస్తుంటారు. జాతి విద్వేషానికి వ్యతిరేకంగా 'బ్లాక్ లైవ్స్ మ్యాటర్' ఉద్యమం జోరందుకున్న నేపథ్యంలో ఈ గుర్తింపుకు మరింత ప్రాధాన్యం పెరిగింది. మరోవైపు భారతీయ అమెరికన్లు కూడా కమలాను తమలో ఒకరిగా చూసుకుంటున్నారు.
తల్లి ఆమెకు స్ఫూర్తి
కమలాపై ఆమె తల్లి శ్యామల గోపాలన్ ప్రభావం చాలా ఎక్కువ. అనేక సందర్భాల్లో ఆమె ఈ విషయం గురించి చెబుతుంటారు. తన తల్లిని కమలా స్ఫూర్తిగా భావిస్తారు. శ్యామలకు నలుగురు తోబుట్టువులు. ఈమె ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకున్నారు. 19 ఏండ్ల వయసులోనే బెర్క్లీ యూనివర్సిటీకి దరఖాస్తు చేసుకుని, చదువు కోసం 1958లో అమెరికాలో అడుగుపెట్టారు. ఆ సమయంలో న్యూట్రిషన్, ఎండాక్రినాలజీలో డాక్టరేట్ చేసేందుకు వెళ్లిన శ్యామల క్యాన్సర్ పరిశోధకురాలిగా మారారు.
పౌరహక్కుల ఉద్యమంలో శ్యామల
''అప్పట్లో అమ్మను అమెరికాకు పంపించడం మా అమ్మమ్మ, తాతయ్యలకు ఎంత కష్టమైన విషయమో నాకు తెలుసు. కమర్షియల్ జెట్ ప్రయాణాలు అప్పుడప్పుడే మొదలయ్యాయి. వాళ్లతో కాంటాక్ట్లో ఉండటం కూడా అప్పట్లో కష్టమే. కాలిఫోర్నియా వెళ్తానని మా అమ్మ అడిగినప్పుడు, వాళ్లు అడ్డు చెప్పలేదు. చదువు పూర్తయిన తర్వాత భారత్కు తిరిగివచ్చి పెద్దలు కుదిర్చిన పెండ్లి చేసుకుంటానని మా అమ్మ తన తల్లిదండ్రులకు మాట ఇచ్చింది. కానీ, ఆమె పరిస్థితి మరోలా మారిపోయింది'' అని చెబుతారు కమలా. బెర్క్లీలో చదువుతున్నప్పుడు పౌర హక్కుల ఉద్యమంలో శ్యామల పాల్గొన్నారు. అక్కడే డోనల్డ్ హారిస్ ఆమెకు పరిచయమయ్యారు. 'పెండ్లి గురించి అమెరికాలో ఉండిపోవాలని తీసుకున్న నిర్ణయం తన తల్లి దఢ సంకల్పానికి, ప్రేమకు నిదర్శనం'' అని కమలా తన పుస్తకంలో రాశారు.
కుటుంబంలోనూ రాజకీయ వాతావరణం
1964లో శ్యామల తన డాక్టరేట్ పూర్తి చేశారు. ఆ ఏడాదే కమలా పుట్టారు. భారత్లో శ్యామల కుటుంబంలోనూ రాజకీయ వాతావరణం ఉండేది. కమలా అమ్మమ్మ పెద్దగా చదువుకోలేదు. అయినప్పటికీ గహ హింస, కుటుంబ నియంత్రణ గురించి ఇతరులకు ఆమె అవగాహన కల్పించేవారు. కమలా తాతయ్య భారత ప్రభుత్వంలో సీనియర్ దౌత్యవేత్త. ఆయన జాంబియాలో పనిచేశారు. ఆ దేశానికి స్వతంత్రం వచ్చాక, శరణార్థులకు పునరావాసం కల్పించేందుకు ఆయన కషి చేశారు.
వేళ్లు బలంగా పాతుకుపోయి వుంటాయి
కమలా ఆత్మకథ 'ద ట్రూత్స్ వి హౌల్డ్' పుస్తకం 2018లో విడుదలైంది. ''కమల అంటే తామర లేదా కమలం అని అర్థం. భారత సంస్కతిలో దానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. పైకి ఆ పూవు కొలనులో తేలియాడుతున్నట్లే కనిపిస్తుంది. కానీ దాని వేళ్లు కొలను అడుగున బలంగా పాతుకుపోయి వుంటాయి'' అంటూ అమెరికన్లకు తన పేరు గురించి ఆ పుస్తకంలో వివరించారామె. తన మేనమామకు, చిన్నమ్మలతో తనకు సాన్నిహిత్యం ఉండేదని.. ఫోన్ కాల్స్, లేఖలు, అప్పుడప్పుడు పర్యటనలతో వారితో టచ్లో ఉండేదాన్నని కమలా తన ఆత్మకథలో రాసుకున్నారు. కమలా తల్లి శ్యామల 2009లో చనిపోయారు. అప్పటికి ఆమె వయసు 70 ఏండ్లు.
సత్తా వున్న వ్యక్తి
డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్ ఓ సందర్భంలో ''నాతో పాటు పనిచెయ్యడానికి తెలివైన, దఢమైన, నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి కావాలి. కమలా అందుకు తగినవారని'' అని జో బిడె ప్రచార ఈమెయిల్లో పేర్కొన్నారు. కమలా హ్యారిస్కు ఉండవలసిన ప్రధాన లక్షణాలన్నీ ఉన్నాయి. జాతీయ స్థాయిలో ఆమె నాయకత్వ లక్షణాలను ఇదివరకే నిరూపించుకున్నారు. ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడించగలిగే సత్తా వున్న వ్యక్తి. న్యాయశాస్త్రంలో డిగ్రీ పొందారు. శాన్ ఫ్రాన్సిస్కో సిటీ అటార్నీగా పనిచేసారు. తరువాత కాలిఫోర్నియా అటార్నీ జనరల్గా కొనసాగారు. ఆమె వాక్పటిమ, సంభాషణా చాతుర్యం, వాదనా పటిమతో చాలా తక్కువ సమయంలోనే ప్రజాకర్షణ పొంది జాతీయ స్థాయి నాయకురాలిగా ఎదిగారు.
నెగ్గుకురాగలనని నిరూపించారు
కమలా హ్యారిస్ ఆన్లైన్ కార్యకలాపల్లో చాలా చురుకుగా ఉంటారు. డెమొక్రటిక్ ప్రెసిడెంట్గా పోటీ చేసినప్పుడు ఆవిడ ప్రదర్శించిన నైపుణ్యాన్ని దేశ ప్రజలందరూ గమనించారు. ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్తో ముఖాముఖి చర్చకు దిగినప్పుడు ఆమె దఢమైన వాదనాపటిమతో నెగ్గుకురాగలనని నిరూపించారు. ఇంటెలిజెన్స్, జ్యుడీషరీ విభాగాల్లో ఆమె ఒక దఢమైన, సమర్థవంతమైన సెనేటర్గా గుర్తింపు పొందారు. నేరస్థులను శిక్షించడంలోనూ, వివాహ వ్యవస్థలో సమానత్వం తీసుకురావడంలోనూ ఆమె గొప్ప నాయకత్వ లక్షణాలను ప్రదర్శించారు. కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి సందర్భంగా తలెత్తిన జాతి అసమానతల పట్ల ఆమె తీవ్రంగా వ్యవహరించారు.