Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనం తినే పండ్లలో అరటిపండు ఎంతో ఆరోగ్యకరమైన ఆహారం. తరచుగా అరటిపండ్లు తింటూ ఉంటే... చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో చాలా పోషకాలు ఉంటాయి. పైగా ఇది తక్షణ శక్తిని ఇస్తుంది. ముఖ్యంగా తిన్న ఆహారం అరగక ఇబ్బంది పడేవారు అరటిపండ్లు తింటూ ఉంటే... జీర్ణక్రియ బాగా పనిచేస్తుంది.
- కొంతమంది హైపర్ టెన్షన్ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు అరటిపండును తినడం మేలు. ఎందుకంటే ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. అది పరిష్కారం చూపిస్తుంది.
- అరటిపండులో సహజమైన యాంటీ-యాసిడ్ ఉంటుంది. ఇది పొట్టలో సమస్యలకు చెక్ పెడుతుంది. అలాగే అరటిలోని షుగర్ శరీరానికి బలాన్ని ఇస్తుంది.
- ఈ పండులో ఫైబర్ ఎక్కువ. అందువల్ల మలబద్ధకం సమస్యకు ఇది చెక్ పెడుతుంది.
- అరటిపండు ఎంత మంచిదైనా రాత్రి సమయంలో దీన్ని తినకూడదంటున్నారు నిపుణులు. ఎందుకంటే... అరటికి బాడీలో వేడిని తగ్గించే గుణం ఉంటుంది. అందువల్ల ఆల్రెడీ చల్లగా ఉన్న శరీరాన్ని ఇది మరింత చల్లబరిచి దగ్గు, జలుబు వచ్చేందుకు కారణం అవుతుంది. అందువల్ల అర్థరాత్రిళ్లు తప్ప మిగతా రోజంతా ఈ పండును తినవచ్చని డాక్టర్లు చెబుతున్నారు.
- పెద్ద అరటిపండ్లు జీర్ణం కావడానికి కాస్త ఎక్కువ టైమ్ తీసుకుంటాయి. అందువల్ల పడుకునే 2 లేదా 3 గంటల ముందే ఈ పండును తినేయాలి. ఆ తర్వాత తినకపోవడం మేలు.
- జలుబు, దగ్గుతో బాధపడే వారు అరటిపండ్లు తినకూడదు. తింటే అవి మరింత ఎక్కువవుతాయి. రాత్రివేళ వీలైనంత వరకూ ఎక్కువ అరటిపండ్లు తినడం తగ్గించాలి. రాత్రివేళ జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. అందువల్ల రాత్రిళ్లు ఈ పండు తింటే వెంటనే జీర్ణం కాదు. తద్వారా నిద్రపట్టని సమస్య ఎదురవుతుంది.