Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పోలీసు కావాలనేది ఆమె చిన్ననాటి కల..అది నెరవేరిన క్షణం ఆమె ఆనందానికి అవధులు లేవు. ఓ రైతు కుటుంబంలో పుట్టిన ఆమెకు ఇది కాస్త కష్టమే. అయినా అనుకున్నది సాధించింది. తన వృత్తికి న్యాయం చేసేందుకు మరెన్నో సాహసాలు చేస్తుంది. తప్పిపోయిన పిల్లలను కన్నవారి వద్దకు చేర్చి వారి కండ్లలో ఆనందాన్ని చూస్తుంది. అంతేకాదు ఇటీవల తప్పిపోయిన పిల్లలను కాపాడినందుకు ఆమె అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ గా పదోన్నతిని కూడా పొందింది. ఆమే ఉత్తర్ ప్రదేశ్కు చెందిన సీమా దాకా...
సీమా దాకా... తప్పిపోయిన 76 మంది పిల్లలను కాపాడారు. దాంతో మొదటి 'అవుట్-ఆఫ్-టర్న్' ప్రమోషన్ సంపాదించారు. ఉత్తర్ ప్రదేశ్కి చెందిన ఓ రైతు కుటుంబంలో పుట్టిన సీమా హెడ్కానిస్టేబుల్గా పని పనిచేస్తున్నారు. ఢిల్లీ, పంజాబ్, పశ్చిమ బెంగాల్కు చెందిన 76 మంది పిల్లలను రక్షించారు. ఈ కేసు విషయంలో సీమా చేసిన సాహసానికీ, చూపిన చాకచక్యానికి గాను అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొందారు.
మరెన్నో సేవలు చేసేందుకు
ఢిల్లీలోని నార్త్ జిల్లాలోని సమరు పూర్ బద్లి స్టేషన్లో హెడ్ కానిస్టేబులగా సీమా పని చేసేది. ఆమె కాపాడిన 76 మంది పిల్లల్లో 56 మంది 14 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నవారు. వీరిలో పంజాబ్, వెస్ట్ బెంగాల్కు చెందిన పిల్లలు కూడా ఉన్నారు. ఈ ఆపరేషన్ విజయవంతం చేసేందుకు సీమాకు రెండున్నర నెలలు పట్టింది. ఆగస్టు 5, 2020న ప్రవేశపెట్టిన ప్రోత్సాహక పథకం కింద ''అవుట్-ఆఫ్-టర్న్ ప్రమోషన్'' అందుకుంది. ఢిల్లీ పోలీస్ శాఖలో ఈ పదోన్నతిని పొందిన మొదటి పోలీసు ఈమెను. సీమా తన ఆనందాన్ని పంచుకుంటూ ''నేను సాధించిన విజయానికి వచ్చిన పదోన్నతి, గుర్తింపు నాకెంతో సంతోషాన్ని కలిగించాయి.. ఇలాంటి ప్రోత్సాహకాలు ప్రజలకు మేము మరిన్ని సేవలు చేసేలా ఉత్సాహపరుస్తాయి'' అంటుంది.
పోలీసు కావాలని
ఉత్తరప్రదేశ్లోని బాగ్పట్ జిల్లాకు చెందిన సీమా 2006 లో ఢిల్లీ పోలీసు శాఖలో చేరారు. పోలీసు కావడం ఆమె చిన్ననాటి కల. అది నెరవేరిన క్షణం ఆమె ఎంతో సంతోష పడ్డారు. ఇప్పుడు అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొందడంతో ఆమె వృత్తి జీవితం మరింత
వేగవంత మయింది. హెడ్ కాని స్టేబుల్గా ఉన్నప్పుడు సీమా చివరిసారిగా సౌత్ ఈస్ట్ ఢిల్లీలో పని చేశారు. ఆ సమయంలో లైంగిక వేధింపుల కేసులపై ఆమె పని చేశారు.
పిల్లలను కాపాడేందుకు
తప్పిపోయిన పిల్లలను తిరిగి కనిపెట్టాలనే ఉద్దేశంతో పోలీసు సిబ్బందిని ప్రోత్సహించే ప్రయత్నంలో ఢిల్లీ పోలీసు కమిషనర్ ''అవుట్-ఆఫ్-టర్న్ ప్రమోషన్'' పథకాన్ని ప్రవేశపెట్టింది. ''ఎవరైనా కానిస్టేబుల్ లేదా హెడ్ కానిస్టేబుల్ 50 మందికి మించి 14 ఏండ్ల లోపు తప్పిపోయిన 50 మంది పిల్లలను 12 నెలల లోపు రక్షించగలిగితే వారికి ఈ పథకం కింద పదోన్నతి లభిస్తుంది.
కన్నవారిలో ఆనందాన్ని నింపుతూ...
వీటితో పాటు ఢిల్లీ పోలీసు శాఖ మరో పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది. అదేమిటంటే సంవత్సరంలో 15మంది పిల్లలను రక్షించగలిగితే 'అసాధరన్ కార్యా పురస్కర్' ప్రదానం చేస్తారు. ఈ పథకం ఆగస్టులో ప్రవేశపెట్టిన తర్వాత తప్పిపోయిన పిల్లలను గుర్తించంలో పోలీసు సిబ్బంది చొరవ పెరిగిందని ఢిల్లీ పోలీసు శాఖ చెబుతుంది. ఇలా తప్పిపోయిన పిల్లలను కనిపెట్టడం, వారిని వారి కన్నవారి దగ్గరకు చేర్చడంతో బాధిత కుటుం బాల్లో ఆనందాన్ని నింపగలుగు తున్నామని, అలాగే ఆ పిల్లలు ఎలాంటి ప్రమాదాలకు గురి కాకుండా, ఎలాంటి అవాంఛనీయ కార్యకలాపాలకు పాల్పడకుండా నిరోధిస్తున్నామని, వారి యుక్త వయసును కాపాడగలుగుతున్నామని పోలీసు శాఖ ప్రకటించింది.