Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మృదువైన చర్మం కోసం టేబుల్ స్పూన్ పెసర పిండిలో టీస్పూన్ తేనె కలపాలి. దాన్ని మీ ముఖం మీద స్క్రబ్ చేసి కొద్దిసేపు అలాగే ఉంచాలి. పూర్తిగా ఎండిపోయిన తర్వాత ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకోవాలి. దీని వల్ల చర్మం మృదువుగా ఉంటుంది.
- ముఖం మీద ఉండే మచ్చలు, మొటిమలను తొలగించడానికి రెండు టేబుల్ స్పూన్ల పెరుగు, పెసర పిండి కలిపి దానిని పేస్ట్ చేసుకుని ముఖానికి రాసుకోవాలి. 10 నిమిషాల తర్వాత కడిగేయాలి. దీనివల్ల చర్మం నిగనిగలాడుతుంది.
- నాలుగు టీస్పూన్ల పెసర పిండి, రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి, కొన్ని పచ్చి పాలు కలపాలి. ప్రతిరోజూ ఈ ఫేస్ ప్యాక్ ఉపయోగిస్తే మొటిమలు వెంటనే మాయమవుతాయి.
- చర్మంపై అవాంఛిత వెంట్రుకలను తొలగించడానికి కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది. నాలుగు టీస్పూన్ల పెసర పిండిని నానబెట్టి మరుసటి రోజు రెండు టీస్పూన్లు ఆరెంజ్ పీల్ పౌడర్, రెండు టీస్పూన్ల గంధపు పొడి, కొద్దిగా పాలతో ఫేస్ ప్యాక్ తయారు చేయండి. దీనిని ఫేస్కు వేసుకుని 15 నిమిషాల తర్వాత కడుక్కోండి. దీనిని క్రమం తప్పకుండా చేస్తే ముఖం మీద ఉండే అవాంఛిత జుట్టు త్వరగా మాయమవుతుంది.