Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బరువు తగ్గాలనుకునేవాళ్లు ఉదయం అల్పాహారం మానేయడం అత్యంత ప్రమాదకరమని వైద్యలు చెబుతుంటారు. అలాగని ఏది పడితే అది తినకూడదు. క్రమ పద్దతిలో సరైన ఆహారం తీసుకుంటే మనం కోరుకున్న శరీరాకృతి మన సొంతమవుతుంది. అయితే ఉదయం ఖాళీ కడుపుతో ఈ ఐదు ఆహారాలు మాత్రం తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటంటే...
సిట్రస్ పండ్లు: సిట్రస్ పండ్లంటే పులుపుతో కూడుకున్నవి. ఉదాహరణకు నిమ్మ, నారింజ, ద్రాక్ష, బత్తాయి వంటివి. ఇందులో ఉండే అధిక ఆమ్లాలు కడుపుపై అదనపు భారాన్ని మోపుతాయట.
చల్లటి నీరు: ఉదయం లేవగానే అందరూ చల్లటి నీళ్లు తాగాలని ఉబలాటపడతారు. కానీ ఇది మన ఆరోగ్యానికి ఎంతో కీడు చేస్తుంది. ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో గోరు వెచ్చటి నీటిని తీసుకోవాలి. నిమ్మరసం, అల్లంలో వేడి నీటిని కలుపుకుని తాగితే అది జీర్ణక్రియను మెరుగుపరుస్తుందే తప్ప చల్లటి నీరు తాగడం వల్ల కాదు. చల్లటి పానీయాలు తాగడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
కారంగా ఉండే ఆహారం: అల్పాహారంలో కారంతో తయారుచేసిన పదార్థాలను అస్సలు ముట్టొద్దు. ఇవి తినడం వల్ల కడుపులో చాలా అసౌకర్యంగా ఉండటమే గాక ఆమ్ల గాఢతను ఎక్కువగా కలిగి ఉండటం వల్ల అది కొద్దిగంటలపాటు మనల్ని ఇబ్బంది పెట్టడం ఖాయం. పొద్దున పూట కారానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
పచ్చి కూరగాయలు: పచ్చి కూరగాయలను ఉడికిచ్చి లేదా అలాగే తినడం మంచిదే కానీ ఖాళీ కడుపుతో మాత్రం తినొద్దట. అది జీర్ణవ్యవస్థమీద అదనపు భారాన్ని మోపుతుందట. ఏదైనా తిన్న తర్వాత కొద్దిసేపటికి వాటిని తింటే ఉపయోగం ఉంటుందట. వీటిని తినడాని కంటే ముందు.. రాత్రి నానబెట్టుకున్న ఎండు ద్రాక్షలు, బాదం, ఇతర గింజ పదార్థాలు తింటే మంచిదట. అందులో ఉండే ప్రోటీన్, ఫైబర్ వల్ల జీర్ణవ్యవస్థ మెరుగవడమే గాక బరువు తగ్గేందుకు కూడా తోడ్పడుతాయట..