Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉద్యోగుల్లో ఎక్కువ మందికి కంప్యూటర్తో విడదీయరాని బంధం ఉంటుంది. అయితే కంప్యూటర్ ముందు ఎక్కువగా కూర్చోవడం వల్ల కంటిచూపు మందగిస్తుందని తేలింది. అంతేకాదు ఎక్కువ సేపు అదే పనిగా కూర్చోవడం వల్ల నడుమునొప్పి వచ్చే అవకాశం కూడా ఉందట. గంటల తరబడి కంప్యూటర్ ముందు కూర్చునే వాళ్లకి ప్రమాదం ముంచుకొస్తున్నట్టు పరిశోధకులు చెబుతున్నారు.
రెండుగంటల కంటే తక్కువ సమయం కంప్యూటర్లు ఉపయోగించే వారితో పోల్చి చూస్తే ఎక్కువసేపు టీవీలు, కంప్యూటర్లతో సావాసం చేసేవారికి రకరకాల రోగాలు వచ్చే ప్రమాదం అధికంగా ఉన్నట్టు ఓ సర్వేలో వెల్లడైంది. దీనివల్ల వచ్చే రోగాలు కొన్ని సందర్భాల్లో ప్రాణాలను కూడా హరిస్తున్నాయట. ఈ మరణాలు కూడా మామూలు మరణాలకంటే 48శాతం ఎక్కువగా ఉన్నాయట.
మరో విషయం ఎలక్ట్రానిక్ వస్తువులకు అంకితమైపోయిన వారు ఎన్ని వ్యాయామాలు చేసినా వేస్ట్ అని కూడా పరిశోధనలు తెలియజేస్తున్నాయి. కంప్యూటర్ ముందు కూర్చోవడం ఎలాగూ తప్పదు కాబట్టి అదే పనిగా కూర్చోకుండా అప్పుడప్పుడు దాని నుంచి కొద్ది నిమిషాలు దూరంగా ఉండమని వైద్యులు సూచిస్తున్నారు. అలా చేయడం వల్ల కండ్లకు, మెదడుకు విశ్రాంతి లభించి, కొంత ఒత్తిడి తగ్గుతుందట.