Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అలెర్జీలు, చర్మ సమస్యలు తొలగిపోవాలంటే.. సబ్బులకు బదులు స్నానానికి సున్నిపిండి వాడితే మంచిది. చర్మ రంధ్రాల లోపల వున్న మురికిని శుభ్రం చేయలేవు. కానీ సున్నిపిండి అలాకాదు.. చర్మ రంధ్రాల లోపలవున్న మురికిని కూడా లాగేస్తుంది. ఎండాకాలంలో సున్నిపిండి వాడితే చెమటకాయలు, దద్దుర్లు వుండవు.
సున్నిపిండితో స్నానంతో శరీరం తేలికగా, హాయిగా, ఆరోగ్యంగా వుంటుంది. చర్మ వ్యాధులు రావు. చర్మానికి రక్త ప్రసరణ పెరుగుతుంది. చర్మ వ్యాధులు వున్నవారు సున్నిపిండితో స్నానం చేసిన తర్వాత కొబ్బరి నూనె రాస్తే కాస్త ఉపశమనం లభిస్తుంది.
కేశాలకు శెనగపిండి ఉపయోగించడం వల్ల చుండ్రు వదలడంతో పాటు ఇతర జుట్టు సమస్యలు కూడా వదులుతాయి.
స్కిన్ టైటనింగ్ కోసం శెనగపిండి, నిమ్మరసం బాగా పనిచేస్తాయి. చెంచా నిమ్మరసం, చెంచా శెనగపిండి రెండింటిని పేస్ట్లా చేసి, ముఖానికి పట్టించి ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. లేదా పచ్చిపాలతో శుభ్రం చేసుకోవాలి. ఇలా ఓ వారం రోజుల పాటు చేయడం వల్ల అద్భుతమైన ఫలితాన్ని పొందవచ్చు.