Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గుజరాత్లోని అహ్మదానగర్.. ఉదయం పూట, 12 యేళ్ళ మిట్టల్ పఠాదిత్య స్కూల్ కు వెళ్లడానికి రెడీ అవుతోంది. అంతలోనే వారికి పరిచయమున్న ఓ ఆటో డ్రైవర్ మరో ఇద్దరితో కలిసి మిట్టల్ ఇంటికి వచ్చాడు. వచ్చీ రాగానే మిట్టల్ను ఓ గ్లాస్ మంచి నీళ్లు ఇవ్వాలని కోరాడు. దీంతో మిట్టల్ వాటర్ తేవడానికి కిచెన్లోకి వెళ్లింది. వెంటనే ఆటోడ్రైవర్తో పాటు వచ్చిన ఇద్దరిలో ఒకడు మిట్టల్ అమ్మను కత్తితో బెదిరిస్తున్నాడు. మరొకడు డబ్బు, నగల కోసం వెతుకుతున్నాడు. మిట్టల్ అమ్మ, వారిని ప్రతిఘటిస్తుంది. దోపిడీకి వచ్చిన దుండగులు ఆమెను సోఫా మీదికి తోసి బలత్కరించబోయారు.
ఇంతలో కిచెన్ నుండి వాటర్ గ్లాస్తో హాల్లోకి వచ్చిన మిట్టల్ అక్కడి దృశ్యాలు చూసి ఒక్కసారిగా షాక్ అయ్యింది. సాధారణంగా ఆ వయసు పిల్లలు ఏడ్చుకుంటూ అక్కడి నుండి భయంతో పారిపోతారు. కానీ మిట్టల్ అలా కాదు. తన చేతిలో ఉన్న గాజు గ్లాస్ను గురి చూసి తన అమ్మను బలత్కారం చేయబోతున్న వాడి తలమీద కొట్టింది. తన చేతికి దొరికిన వస్తువులను ముగ్గురు దుండుగుల మీదకు విసురుతూనే ఉంది. ఇలా చేస్తూనే పెద్దగా రక్షించండీ, రక్షించండీ అని అరుస్తుంది.
ఆ దుండగులలో ఒకతను చాలా కోపంతో తన వద్దనున్న కత్తిని తీసి, మిట్టల్ను పొడిచాడు. అలా ఒకే చోట మిట్టల్ను కత్తితో కంటిన్యూయస్గా పొడుస్తూనే ఉన్నాడు. అయినప్పటికీ మిట్టల్ తన పోరాటాన్ని ఆపలేదు. మిట్టల్ కొట్టిన దెబ్బలకు ఓ దుండగుడు కింద పడిపోయాడు.ఇంతలో మిట్టల్ అరుపులకు చుట్టుపక్కల వాళ్లందరూ వచ్చి దుండగులను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. తర్వాత మిట్టల్ కూడా సృహ తప్పి పడిపోయింది. హాస్పిటల్కు చేర్చితే కత్తి పోటుకు గురైన దగ్గర సుమారు 350 కుట్లను వేశారు. ఇది జరిగి నాలుగేళ్ళు అవుతుంది. తన తల్లిని ధైర్యంగా కాపాడుకున్న మిట్టల్ను అభినందిస్తూ, ఆమె చేసిన సహాసానికి సాహస బాలిక అవార్డుతో సత్కరించారించింది కేంద్ర ప్రభుత్వం.