Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇట్ల చేద్దాం
వర్షకాలంలో అల్లం టీ ఎంతో మంచిది. టీతో పాటు ఈ కాలంలో ఆహార పదార్థాల్లో అల్లంను ఎక్కువగా తీసుకుంటే జలుబు, దగ్గు నుండి ఉపశమనం పొందవచ్చు.
నిమ్మరసం తాగడం చాలా మంచిది అన్న విషయం అందరికీ తెలిసిందే. నిమ్మరసం తీసుకోవడం వల్ల శరీరంలోని మలినాలన్నీ బయటకు విసర్జింపబడి శుభ్రపడుతుంది. చర్మం సరికొత్త కాంతిని పొందుతుంది. అయితే ఈ నిమ్మరసాన్ని కూడా ఓ పద్ధతి ప్రకారం తీసుకుంటేనే మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అర చెక్క నిమ్మరసం, చిటికెడు మిరియాల పొడి, ఒక స్పూను తేనె వేసి బాగా కలపాలి. దీన్ని రెగ్యులర్గా పరగడుపున తీసుకోవడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. నిమ్మ శరీరంలోని మాలిన్యాలను తొలగిస్తే, తేనె రోజువారీ పనులకు అవసరమైన శక్తిని ఇస్తుంది. నిమ్మరసం తీసుకున్న తర్వాత అరగంట వరకు ఎలాంటి ఆహారం తీసుకోకూడదు. ఇలా చేస్తే మీరు కోరుకున్న ప్రయోజనాన్ని సొంతం చేసుకోవచ్చు. ప