Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముఖసౌందర్యానికి శెనగపిండి ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే గోధుమపిండిని ఫేస్ప్యాక్గా వేసుకున్నా.. చర్మానికి నిగారింపు చేకూరుతుందని బ్యూటీషియన్లు చెబుతున్నారు.
ఒక స్పూన్ గోధుమపిండికి కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా పెరుగు చేర్చి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి పూర్తిగా ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ను వారానికొకసారి అప్లై చేస్తే చర్మం ఫెయిర్గా మారుతుంది.
ఒక స్పూన్ గోధుమపిండి, రెండు స్పూన్ల రోజ్ వాటర్ వేసి పేస్ట్లా చేసి ముఖానికి పట్టించి ఇరవై నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం చర్మం మెరుస్తుంది.
పాపు కప్పు గోధుమలను రాత్రినానబెట్టాలి. ఉదయం వాటిని మిక్సీ చేసి అందులో నుంచి గోధుమపాలను వడకట్టాలి. ఈ పాలలో కొద్దిగా నిమ్మరసం, తేనె కలపాలి. ఈ మిశ్రమంతో ముఖానికి మసాజ్ చేయాలి. ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ప