Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సరళాదేవి చౌదరిని
(9 సెప్టెంబరు 1872 - 18 ఆగస్టు 1945).
మహిళల్లో అక్షరాస్యత పెరిగినప్పుడే సాధికారత సాధ్యమవుతుందని నమ్మిన వ్యక్తి సరళాదేవి. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ మేనకొడలు. రచయితగా, గాయనీగా సంగీతం ద్వారా దేశభక్తిని చాటిన తొలి తరం రాజకీయ మహిళా నేత. భారతదేశంలో మొట్టమొదటి మహిళల సంస్థ 'భారత్ స్త్రీ మహమండల్ 'ను , 1910 లో అలహాబాదులో స్థాపించిన స్త్రీవాది.
కోల్కత్తాలో బాగా ప్రసిద్ధి చెందిన బెంగాలీ కుటుంబంలో సరళాదేవి జన్మించారు. ఆమె తండ్రి జనకనాథ్ ఘోసల్ బెంగాల్ కాంగ్రెస్ తొలి కార్యదర్శుల్లో ఒకరు. ఆమె తల్లి స్వర్ణకుమారి దేవి బెంగాలీ సాహిత్యంలో మొదటి మహిళా నవలా రచయిత. స్వర్ణకుమారి దేవి, ప్రముఖకవి దేవేంద్రనాథ్ ఠాగూర్ కుమార్తె, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ అక్క. సరళాదేవి కలకత్తా యూనివర్శిటీ నుండి ఆంగ్ల సాహిత్యంలో గోల్డ్ మెడల్ అందుకున్నారు. బెంగాల్లోని మొదటి మహిళా రాజకీయ నాయకురాలిగా ఎదిగారు.
జర్నలిస్టు, లాయర్ పండిట్ రాంబుజ్ దత్ చౌదరితో పెండ్లి తర్వాత రాజకీయ కార్యకలాపాల్లో మరింత చురుకుగా పాల్గొన్నారు. జాతీయవాద ఉర్దూ వారపత్రిక 'హిందూస్థాన్' సంకలనం చేయడంలో తన భర్తకు సహకారం అందించారు. బ్రిటిష్ ప్రభుత్వాన్ని విమర్శించడానికి, ప్రజలను చైతన్యం చేయడానికి ఆమె పత్రికా మాధ్యమాన్ని ఉపయోగించారు. ప్రభుత్వం రాంబుజ్ను అరెస్టు చేసి జైలుకు పంపింది. ఆమె సొంతంగా ఆంగ్ల సంచికను కూడా ప్రచురించారు. జలియన్వాలాబాగ్ దుర్ఘటనను తీవ్రంగా విమర్శిస్తూ.. కథనాలు రాసారు. అనేక గేయాలు రాసి, సంగీతం ద్వారా ప్రజల్లో దేశభక్తిని ప్రచారం చేశారు.
సరళాదేవి జీవిత లక్ష్యాలలో మహిళా సాధికారత ప్రధానమైంది. భారత్ స్త్రీ మహామాండల్ను అలహాబాద్లో స్థాపించి లాహౌర్, ఢిల్లీ, కరాచీ, అమత్సర్, హైదరాబాద్, కాన్పూర్, హజారీబాగ్, కోల్కత్తా తదితర నగరాల్లో అనేక శాఖలను ఏర్పాటుచేశారు. విద్య ద్వారానే మహిళల జీవితాల్లో మార్పు తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. ప