Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గరికపాటి వరలక్ష్మి
(13 సెప్టెంబరు 1926 - 26 నవంబర్ 2006)
చలనచిత్ర రంగంలో నటిగా, గాయనిగా, దర్శకురాలిగా ప్రేక్షకుల నాడి తెలిసిన కళాకారిణి జి. వరలక్ష్మి. మూడు దశాబ్దాలకు పైగా ఆమె చిత్రపరిశ్రమలో ఉన్నారు. తెలుగు, తమిళ చిత్రాలలో నటించారు.
ద్రోహి, లేత మనసులు సినిమాలలో ఆమె నటనకు ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు. ఒంగోలులో జన్మించివ వరలక్ష్మి చిన్నతనం నుంచే తన గళంలో ఆకట్టుకునేవారు. 11ఏండ్ల్ల వయసులో విజయవాడ చేరుకొని తుంగల చలపతి, దాసరి కోటిరత్నం మొదలైన ప్రముఖ రంగస్థల నటుల నాటక బృందాలలో చేరారు. అనేక పౌరాణిక, సాంఘీక నాటకల్లో ఆమె నటించారు. ఆమె తన మృదుమధుర స్వరంలో ప్రేక్షకులను ఆకుట్టుకున్నారు. 'సక్కుబాయి', 'రంగూన్ రౌడీ' వంటినాటకాల్లోని ఆమె నటనకు మంచి పేరు, గుర్తింపు వచ్చింది. రంగస్థలంపై తన నటన, గాత్రంతో గుర్తింపు కె.ఎస్.ప్రకాశరావు, హెచ్.ఎం.రెడ్డి వంటి తెలుగు సినిమా ఆద్యులను ఆకర్షించింది. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు రావడానికి కారణమైంది. హెచ్.ఎం.రెడ్డి 1940లో తీసిన వ్యంగ్య హాస్య చిత్రం 'బారిష్టరు పార్వతీశం' సినిమాతో వరలక్ష్మిని చిత్రరంగానికి పరిచయం చేశాడు.
గాయనీగా ఆమె చిత్రపరిశ్రమలో స్థిరపడే ప్రయత్నం చేసినా ఫలించలేదు. దాంతో నటిగానే తెలుగు ప్రేక్షకులను అలరించారు. చిత్ర నిర్మాత, స్టూడియో యజమాని కె.ఎస్. ప్రకాష్ రావుతో విెవాహం తర్వాత నిర్మాతగా, దర్శకులురాలిగా మారారు.
వరలక్ష్మి నటించిన 'కుల గోత్రాలు', 'పెళ్లి చేసి చూడు' వంటి చిత్రాలలు విజయవంతంగా ప్రదర్శించబడ్డాయి. 1940 నుంచి 1950 మధ్య కాలంలో తెలుగు, తమిళ భాషలలోఅందరు అగ్ర హీరోలతో హీరోయిన్గా నటించారు. దాదాపు 50 సినిమాల్లో ఆమె తన నటనతో హీరోయిన్గా, సోదరిగా, తల్లిగా, అత్తగా నటించి తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. 'మూగజీవి' సామాజిక చిత్రానికి ఆమె దర్శకత్వం వహించారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.జి.ఆర్ పార్టీలో చేరారు. తమిళనాడు రాజకీయాల్లో నూ కొద్దిరోజులు చురుకైన పాత్ర పోషించారు.
నాటక రంగం నుంచి ఎదిగిన ఆమె ఆంధ్ర ప్రదేశ్ ప్రజా నాట్య మండలిలో చురుకైన సభ్యురాలిగా వ్యవహరించారు. 80 ఏళ్ల వయసులో వరలక్ష్మి 26 నవంబర్, 2006న మద్రాసులో మరణించారు. కుమారుడు కె.ఎస్.సూర్యప్రకాష్ ఛాయాగ్రాహకుడిగా, మనవరాలు మానస నటిగా తెలుగు సినీ రంగంలో ఆమె వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు.