Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చాలామందిని జిడ్డు సమస్య వేధిస్తుంటుంది. దానికి తోడు మొటిమలు చేరితే.. ఇబ్బందికరంగా ఉంటుంది. మరి జిడ్డు, మొటిమలను వదిలించుకోవడానికి అద్భుతంగా పనిచేస్తుంది తేనె. దాన్నెలా ఉపయోగించాలో చూద్దాం..
గుప్పెడు తాజా పుదీనా ఆకులని మెత్తగా నూరి, రెండు చెంచాల తేనె కలపాలి. దీన్ని ముఖానికి పట్టించి ఆరిన తరవాత కడిగేసుకోవాలి. ఇలా వారానికోసారి చేస్తుంటే మొటిమల సమస్య తగ్గడమే కాదు, జిడ్డు కూడా వదులుతుంది.
గులాబీనీటిలో కొద్దిగా నిమ్మరసం కలిపి.. ముఖానికి రాసుకోవాలి. పది నిమిషాలయ్యాక చన్నీళ్లతో కడిగేసి ఆపై తేనెతో పూత వేసుకోవాలి. తర్వాత కడిగేస్తే సరిపోతుంది. నిమ్మరసం ముఖంలోని జిడ్డునీ, యాక్నెని తొలగిస్తే తేనె ముఖానికి కావాల్సిన తేమను అందిస్తుంది.
ముందుగా కీరదోసని సన్నగా తరుముకుని దానిని మిక్సీలో వేసి రసాన్ని వడకట్టి పెట్టుకోవాలి. కీరదోస ముద్దని ముఖానికి ప్యాక్లా వేసుకోవాలి. ఆరిన తర్వాత ఇందాక మనం తీసిపెట్టుకున్న రసాన్ని కొద్దికొద్దిగా చిలకరించడంకానీ దూదితో అద్దడం కానీ చేస్తే చక్కని ఫలితం ఉంటుంది. ఇలా వారానికి కనీసం రెండు సార్లు చేయాలి.
గుడ్డులోని తెల్లసొనని బాగా గిలకొట్టి దానిని యాక్నె ఉన్న చోట కాస్త దట్టంగా ప్యాక్లా వేసుకోవాలి. జిడ్డు చర్మం ఉన్నవారు తెల్లసొనకి నిమ్మరసం కూడా కలిపి వేసుకుంటే తక్షణ ఫలితం ఉంటుంది.
కొద్దిగా ఓట్మీల్తో చేసిన జావ తీసుకుని దానికి మెత్తగా రెండు చెంచాల ఉల్లిపాయ ముద్దను కలుపుకోవాలి. అవసరం అనుకుంటే మిక్సీలో మెత్తగా చేసుకుని దీనికి కొద్దిగా తేనె కలిపి ముఖానికి ప్యాక్లా వేసుకోవాలి. ఇరవ్కెనిమిషాల తర్వాత కడిగేస్తే సరిపోతుంది.