Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అధిక బరువు అనేది ఒక సమస్యగా, అనారోగ్య సూచికగా మారిపోయింది. బరువు పెరిగిన తర్వాత ఫిట్నెస్ సెంటర్ల చుట్టూ తిరిగి వేలాది రూపాయలను ఖర్చు చేస్తున్నారు. అయినా.. సరైన ఫలితం లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్యలకు ఉదయాన్నే ఒక గ్లాస్ గోరువెచ్చని నీటితో చెక్ చెప్పవచ్చని పరిశోధకలు అంటున్నారు.
ప్రతి రోజూ పొద్దున్నే ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్లు తాగితే కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. సాధారణంగా పొద్దున్నే నిద్ర లేవగానే కాఫీ, టీ తాగే అలవాటు చాలామందికి ఉంటుంది. వీటికి బదులుగా గోరువెచ్చని నీళ్లు తాగితే కలిగే లాభాలు చాలా ఉన్నాయి.
ఒక గ్లాసు వేడినీళ్లు పొద్దున్నే తీసుకోవడం వల్ల శరీరంలోని ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీనివల్ల ఎక్కువ క్యాలరీలను కరిగించడం సులభం అవుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి గోరువెచ్చని నీళ్లు ఎంతో ఉపయోగపడుతాయి.
శ్వాస నాళాలు శుభ్రపడి శ్వాస బాగా ఆడుతుంది. శరీరానికి కావల్సిన ఆక్సిజన్ త్వరగా అందుతుంది.
గోరువెచ్చని నీళ్లు తాగటంతో జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యల నుంచి త్వరగా ఉపశమనం కలుగుతుంది.
పరగడపున వేడినీళ్లు తాగడం వల్ల శరీరంలోని హానికారక మలినాలు, చెడు పదార్థాలు తొలగిపోతాయి. దీనివల్ల రక్తప్రసరణ బాగా మెరుగుపడుతుంది.
జీర్ణక్రియను మెరుగుపర్చటమే కాకుండా శరీరంలో అన్ని క్రియలు సక్రమంగా సాగేలా సాయపడుతుంది.
పొట్టలోని ఆహారాన్ని, ద్రవాలను డీకంపోజ్ చేసి, జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది.
మలబద్దకం సమస్యతో బాధపడుతున్నవారు ప్రతి రోజు ఉదయం గోరువెచ్చని నీళ్లు తాగితే తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యి మలబద్దకం సమస్య తీరుతుంది.
వేడినీరు తాగడంతో కిడ్నీల, ఇతర అవయవాల పనితీరు మెరుగవుతుంది.
మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న వేడినీళ్లను ప్రతి రోజు పొద్దున్నే తాగితే ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. రి