Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మన వంటగదిలో ఉండే పదార్ధాలతో అనేక రకాల రోగాలు తగ్గించుకోవచ్చు. అందుకే వంటింటిని ఔషధశాల అని కూడా పెద్దలు అంటారు. అయితే ఏ సమస్యలకు ఏ దినుసులను ఉపయోగించాలో తెలుసుకుంటే చాలు. తరచుగా వచ్చే రోగాలని చిన్న చిన్న చిట్కాలతో తగ్గించుకోవచ్చు.
సాధారణంగా మిరియాలని చాలా మంది తినడానికి ఇష్టపడరు..కారణం అవి చాలా ఘాటుగా ఉంటాయి. కానీ అవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలాగే తులసి ఆకులు కూడా మన ఆరోగ్య సంరక్షణలో బాగా ఉపయోగపడుతాయి. ఈ రెండింటిని కలిసి ఉపయోగిస్తే కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి.
వాతావరణం చల్లగా ఉన్నప్పుడు జలుబు, దగ్గుతో పాటు కఫం సమస్యతో బాధపడుతారు. దీనిని తగ్గించుకోవడానికి అనేక రకాల మందులు వాడుతూ ఉంటారు. అయితే మిరియాల పొడి వేడి అన్నంలో వేసుకుని రెండు ముద్దలు తింటే కఫం సమస్య తగ్గుతుంది.
జలుబుతో బాధపడుతున్న వాళ్ళు ప్రతి రోజూ పొద్దున్నే కొన్ని తులసి ఆకుల్ని దంచి కషాయం చేయాలి. దానిలో ఒక స్పూన్ తేనె కలిపి వేడిగా తాగితే జలుబు తగ్గుతుంది.
మిరియాల పొడిని బెల్లంతో కలిపి తీసుకున్న జలుబు తగ్గుతుంది.
తులసి ఆకుతో చేసిన కషాయంలో చిటికెడు మిరియాల పొడి, ఒక స్పూన్ తేనె వేసి తాగితే త్వరగా జబులు, దగ్గు తగ్గుతుంది.