Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బ్రిటిష్ పాలన నుంచి మనదేశానికి విముక్తి కల్పించాలని ఎందరో.. ఎన్నో పోరాటాలు చేశారు. అయితే మనదేశ పౌరులు బానిసలుగా బతకడం ఇష్టలేని ఒక మహిళ స్వాతంత్య్రపోరాటంలో కీలకపాత్ర పోషించారు. సత్యం, ధర్మం, న్యాయం, త్యాగం ఈ నాలుగు సూత్రాలనూ ప్రజలకు బోధిస్తూ వారిలో నూతన చైతన్యాన్ని కలిగించారు. ' న్యూ ఇండియా ', అనే ఆంగ్ల పత్రికను స్థాపించి, రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూ ' కామన్ వీల్ ' అనే వారపత్రిక నడుపుతూ ' హొం రూల్ లీగ్ ' ఉద్యమానికి రూపకల్పన చేశారు. ఆమె అనిబిసెంట్. ఐరిష్ మహిళ. మహిళాహక్కుల ఉద్యమవాది, రచయిత.
అనిబిసెంట్ 1847 అక్టోబర్ 1న లండన్ లో జన్మించారు. తల్లి ధార్మిక స్వభావి. తండ్రి డా.విలియం ఫేజ్ గొప్ప విద్వాంసుడు. తన తల్లి కోరికమేరకు ఫాదర్ ఫ్రాంక్ బిసెంట్ ని ఆమె పెండ్లి చేసుకున్నారు. అంతవరకూ అనీగా పిలవబడిన ఆమె పెండ్లి తర్వాత అనీ బిసెంట్ గా మారారు. ఆమె 1874 లో ఇంగ్లాడులోని నేషనల్ సెక్యులర్ సొసైటీ అనే సంస్థలో చేరారు. లా అండ్ రిపబ్లిక్ లీగ్ ని స్థాపించి పోలీసు అత్యాచారాలకు బలైన కుటుంబాలకు సేవచేశారు. భర్తతో మతపరమైన విభేదాలు రావడంతో ఇద్దరూ విడిపోయారు. తరువాత ఆమె జాతీయ సామ్యవాద సంఘానికి ప్రముఖ ఉపన్యాసకురాలుగా వ్యవహరించారు. 1880లో అనీ బిసెంట్ 'హెలెనా బ్లావట్ స్కీ'ని కలుసుకున్న తరువాత ఆమె ఆసక్తి సామ్యవాదం నుండి దివ్యజ్ఞానం వైపు మళ్ళింది. ఈ సమాజంలో చేరి ఐరోపా, అమెరికా, ఆస్ట్రేలియా దేశాలు తిరిగి ఉపన్యాసాలు ఇచ్చారు. 1893లో భారతదేశానికి వచ్చిన ఆమెకు ఇక్కడి ఆంగ్లేయుల పరిపాలనలో మగ్గిపోతున్న ప్రజల్ని చూసి చలించిపోయారు. ప్రజలలో ఉన మూఢనమ్మకాలను, అజ్ఞానాన్ని, నిరక్ష్యరాస్యతను, సాంఘీక దురాచారాలను రూపు మాపి వారిని చైతన్యవంతులుగా మార్చినప్పుడు, ప్రజలే ఆంగ్లేయులకు సరైన గుణపాఠం నేర్పుతారని ఆమె గ్రహించారు. భారతదేశమే తన ఆఖరి మజిలీగా నిర్ణయించుకున్నారు. 1898లో కేంద్రీయ హిందూ కళాశాల స్థాపనకు సహకరించారు. 1907లో ఆమె దివ్యజ్ఞానసమాజం అధ్యక్షురాలయ్యారు. భారతీయ రాజకీయాలలో ప్రవేశించిన ఆమె జాతీయ కాంగ్రెస్లో సభ్యత్వం తీసుకున్నారు. 1914లో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభం ఆమె ఏర్పాటుచేసిన హౌం రూల్ లీగ్ స్వాతంత్య్రోద్యమానికి సహకరించింది. 1917లో ఆమె భారతీయ జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలైంది.
అనిబిసెంట్ రచించిన ' లెక్చర్ ఆన్ పొలిటికల్ సైన్స్ 'పుస్తకంలో పాశ్చాత్య, భారతీయ రాజకీయ వ్యవస్థల గురించి పరిష్క తం కాగలిగే సూచనలను ఇచ్చారు. ఎన్నోరకాల ప్రాతిపదికలతో జాతీయ విద్యా ప్రణాళికను రూపొందించారు. ఇండియన్ బార్సు స్కౌట్ అసోషియేషన్ స్థాపించారు. 1921లో కాశీ హిందూవిశ్వవిద్యాలయం డాక్టర్ ఆఫ్ లెటర్స్ బిరుదునిచ్చి సత్కరించింది. 80సంవత్సరాల వయసులో బుడాపెస్ట్ యూరోపియన్ కాంగ్రెస్, చికాగో ప్రపంచ కాంగ్రెస్ కు అధ్యక్షత వహించారు. 1933 సెప్టెంబర్ 20న తమిళనాడు లోని అడియార్లో ఆమె మరణించారు.