Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్.వరలక్ష్మి
(1937 - సెప్టెంబర్ 22, 2009)
బాలనటిగా సినీరంగంలో అడుగుపెట్టి, హీరోయిన్గా ఎక్కువగా పౌరాణిక పాత్రలను పోషించారు. నటనతోనే కాకుండా తన గళంతోనూ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం. ఆమె ఎస్ వరలక్ష్మి. సత్యహరిశ్చంద్ర సినిమాలో చంద్రమతి. లవకుశలో భూదేవిగా ఆమె పోషించిన పాత్రలు నీరాజనాలు అందుకున్నాయి. మితభాషిగా పరిశ్రమలో గుర్తుంపు పొందారు.
జగ్గంపేటలో జన్మించిన వరలక్ష్మి బాలనటిగా సినీపరిశ్రమలోకి వచ్చారు. ప్రముఖ రంగస్థల నటుడు గూడవల్లి రామబ్రహ్మం ప్రోత్సాహంతో సినిమాల్లోకి వచ్చిన ఆమె తన పాత్రకు తానే పాటలు పాడుకునేవారు. ఆమె నటించిన మొదటి చిత్రం 'బాలయోగిని' (1937) తర్వాత 'రైతుబిడ్డ' (1939)లో నటించారు. 'ఇల్లాలు'లో ఆమె పాడిన 'కోయిలోకసారొచ్చి కూసిపోయింది' పాటతో పరిశ్రమలో గుర్తింపు పొందారు. ఎస్.రాజేశ్వరరావుతో కలిసి 'శాంత బాలనాగమ్మ' (1942)లో నటించింది. ఆ సినిమాలో రాజేశ్వరరావుతో కలిసి పాటలు పాడారు. పి.సూరిబాబు, రాజేశ్వరీ ట్రూప్లతో కలిసి ఆంధ్రదేశమంతా తిరిగి నాటకాలు వేసింది వరలక్ష్మి.
'పల్నాటి యుద్ధం' చిత్రంతో ఆమె తెలుగు ప్రేక్షకుల అభినందనలు అందుకున్నారు. ఈ చిత్రంలోని పాటల్ని మద్రాసు ఆలిండియా రేడియో వారు రికార్డింగ్ అయిన మరుసటి రోజే ప్రసారం చేశారు. ఆ ఘనత అంతకుముందూ, ఆ తర్వాత కూడా మరెవరికీ దక్కలేదు. శివాజీ గణేశన్తో కలిసి ఆమె నటించిన 'వీరపాండ్య కట్టబ్రాహ్మణ్' చిత్రం కైరోలో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శింపబడింది. ఈ వేదికపై వరలక్ష్మి గాత్రానికి ప్రత్యేక ప్రశంసలు లభించాయి. ప్రముఖ నటి కన్నాంబ ప్రోత్సాహంతో నిర్మాతగా మారి 'వరలక్ష్మీ పిక్చర్స్' ప్రారంభించారు. ఈ బ్యానర్పై నిర్మించిన తొలి సినిమా 'సతీ సావిత్రి' (1957) ఈ సినిమా ద్వారా ప్రముఖ సంగీత కళాకారుడు మంగళంపల్లి బాలమురళీక ష్ణ సినిమారంగానికి పరిచయం కావడం ఒక విశేషం. ఎనిమిది మంది సంగీత దర్శకులు ఈ సినిమా కోసం పనిచేయడం మరో విశేషం.
'వయ్యారి భామలు వగలమారి భర్తలు', ముద్దుల క ష్ణయ్య తదితర పలు తెలుగు చిత్రాలలో నటించారు. సత్యహరిశ్చంద్ర సినిమాలో చంద్రమతి. లవకుశలో భూదేవిగా ఆమె పోషించిన పాత్రలు నేటికి తెలుగు ప్రేక్షకులకు గుర్తున్నాయి. తమిళంలో వీరపాండ్య కట్టబొమ్మన్, పణమా పాశమా, గుణ తదితర చిత్రాల్లోనూ ఆమె నటించారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎల్. శ్రీనివాసన్ను పెళ్లాడారు. వారికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. చైన్నెలో ఆమె మరణించారు. రీ