Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముఖ్యంగా గర్భిణి స్త్రీలు ప్రతిరోజు తీసుకునే ఆహారం పదార్థాల్లో బీన్స్, అరటి, పాలు, గుడ్లు, చేపలు, పెరుగు, క్యారెట్స్ తప్పని సరిగా ఉండాలి. ఈ పదార్థాలు శరీరానికి బలాన్ని అందించడంతో పాటు శిశువు ఆరోగ్యానికి సహాయపడతాయి. అలాంటి కొన్ని మెరుగైన ఆహారపదార్థాల గురించి తెలుసుకుందాం...
బీన్స్: కనీసం వారానికి మూడు సార్లు బీన్స్ను ఆహారంగా తీసుకోవాలి. బ్లాక్ బీన్స్, సోయా బీన్స్ తీసుకుంటే సరిపోతుంది. బీన్స్ను జ్యూసులా లేదా సలాడ్ రూపంలో తీసుకున్నా మంచి ఫలితం ఉంటుంది. వీటిలో పోషకాలు, క్యాల్షియం, ఫోలట్, ఖనిజాలు, జింక్ పుష్కలంగా ఉంటాయి.
బలవర్ధకమైన ధాన్యాలతో కూడిన అల్పాహారం
అరటి: తక్షణ శక్తిని అందించడంలో అరటి పాత్ర కీలకం. అల్పాహారంగా అరటి పండును ముక్కలతో పాటు నారింజ జ్యూస్ను తీసుకోవచ్చు.
చేప: చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల వల్ల విటమిన్ 'బి' చక్కగా లభిస్తుంది. చేపలు ముఖ్యంగా గర్భిణి స్త్రీల ఆరోగ్యానికి చాలా సహాయపడతాయి.
పెరుగు: పెరుగులో చాలా రకాల ప్రోటీన్లు ఉంటాయి. అయితే కొవ్వు శాతం తక్కువగా ఉండేలా చూసుకోవాలి. పెరుగును పండ్లతో పాటూ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. పెరుగు ముఖ్యంగా శిశువు ఎదుగుదలకు తోడ్పడుతుంది. అలాగే జీర్ణక్రియని మెరుగుపర్చుతుంది.
గింజలు: గింజల్లో ముఖ్యంగా విటమిన్'ఇ', ఖనిజ లవణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ప్రోటీన్లను, ఫైబర్ ను కలిగి ఉంటాయి. అలాగే శిశువు ఎదుగుదలకు దోహద పడతాయి.
ఓట్స్: ఓట్స్లో ఫైబర్, ప్రోటీన్స్, విటమిన్'బి', ఐరన్, ఖనిజాలు ఉంటాయి. అందువల్ల రోజూ ఉదయాన్నే అల్పాహారంగా తీసుకోవాలి. ఒక గ్లాసు పాలతో పాటు ఓట్స్ను తీసుకుంటే సరిపోతుంది.
క్యారెట్స్: క్యారెట్స్లో విటమిన్-ఎ సమృద్ధిగా ఉంటుంది. విటమిన్'ఎ' వల్ల శిశువు కండ్లు, పళ్ళు, ఎముకలు దృఢంగా పెరుగుతాయి. అలాగే క్యారెట్స్లో విటమిన్ 'సి', విటమిన్ 'బి-6' కూడా ఉంటాయి.