Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అసీమా చటర్జీ
(23-9-1917) - (22-11-2006)
ఆర్గానిక్ కెమిస్ట్రీలో పరిశోధనలు చేసి ఎన్నో వ్యాధులకు మందులను కనుగొన్న శాస్త్రవేత్త. భారతదేశంలోని ఔషధ మొక్కలపై పుస్తకాన్ని రచించిన రసాయన శాస్త్రవేత్త అసీమా చటర్జీ. పరిశోధనారంగంలో ఎన్నో అంతర్జాతీయ, జాతీయ అవార్డులను ఆమె అందుకున్నారు. అసీమా చటర్జీ బెంగాల్ల్లో జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసిన కలకత్తా విశ్వవిద్యాలయ పరిధిలోని స్కాటిష్ చర్చి కళాశాల నుండి రసాయనశాస్త్రంలో డిగ్రీ, 'ఆర్గానిక్ కెమిస్ట్రీ'లో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశారు. ఆ తర్వాత డాక్టరల్ వర్క్ పూర్తిచేసి డి.ఎస్.సి. పట్టా అందుకున్నారు. ఆ తర్వాత అమెరికా వెళ్ళి యూనివర్సిటీ ఆఫ్ విస్కన్సిస్లో పరిశోధనలు (1947-48) నిర్వహించారు.
ఆమె ప్రముఖ శాస్త్రవేత్తలు ప్రఫుల్ల చంద్ర రే, ప్రొఫెసర్ ఎస్.ఎన్.బోస్ అధ్వర్యంలో సంస్లేషిత కర్బన రసాయన శాస్త్రంలో వృక్ష ఉత్పత్తులపై పరిశోధనలు చేశారు. అమెరికాలో పరిశోధనలు పూర్తి చేసి తిరిగి ఇండియా వచ్చారు. కలకత్తా యూనివర్సిటీ ''లేడీ బ్రబోర్నె కాలేజి''లో చేరి రసాయన శాస్త్ర విభాగానికి అధిపతిగా పనిచేసారు. 1944లో ఇండియా విశ్వవిద్యాలయంలో శాస్త్రీయ విజ్ఞానంలో డాక్టరేట్ పొందిన మొదటి మహిళగా సరికొత్త రికార్డు సృష్టించారు. 1954 లో ఆమె కలకత్తా యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా కెమిస్ట్రీ విభాగంలో చేరారు. 1962 లో కలకత్తా విశ్వవిద్యాలయంలో గౌరవ ప్రొఫెసర్గా పనిచేసారు.
ఔషధ మొక్కల నుంచి ఆల్కలాయిడ్స్, పాలీ ఫినోలిక్స్, టెర్పెనోయిడ్స్, కౌమరిన్స్ మొదలైన సహజ ఉత్పత్తులను పరిశోధించడంలో విశేష క షి చేశారు.. ూaతీaశ్రీ వీaసష్ట్రyaఎaఱఅ =aఝyaఅa (3 సంపుటములు), దీష్ట్రaతీa్వతీ దీaఅబరష్ట్రaసఱ మొదలైన గ్రంథలను రచించారు. 240 కి పైగా పరిశోధనా పత్రాలను వెలువరించారు. ''జర్న ఆఫ్ ది ఇండియన్ కెమికల్ సొసైటీ''కి సంపాదకులుగా ఉన్నారు. అమెరికా లోని సిగ్మా శ× సంస్థకు గౌరవ సలహాదారుగా ఉన్నారు. అసీమా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ఆఫ్ ఇండియా, నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ మొదలైన సంస్థలలో పరిశోధనలు నిర్వహించారు.రాజకీయాల్లో చేరి రాజ్యసభ సభ్యురాలుగా (1982 - 90), ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ కు అధ్యక్షురాలిగా (1975) ఉన్నారు. ప
పురస్కారాలు
తన జీవితకాలంలో ఆమె అందుకున్న అవార్డులు ఎన్నో ఉన్నాయి. యూనివర్సిటీ కలకత్తా నుండి సైన్స్ లో డాక్టరేట్ చేసిన మొదటి మహిళ (1944)గా రికార్డు సృష్టించారు. అంతేకాదు యూనివర్సిటీ ఆఫ్ కలకత్తాకు చెందిన అత్యంత గౌరవ పదవి ' ఖైరా ప్రొఫెసర్ ఆఫ్ కెమిస్రీ'్టలో కొనసాగారు. కలకత్తా యూనివర్సిటీ వారి నాగార్జున ప్రైజ్, గోల్డ్ మెడల్ (1940), ప్రేమ్చంద్ రాయల్ స్కాలర్ ఆఫ్ కలకత్తా యూనివర్సిటీ అందుకున్నారు.
1960: న్యూఢిల్లీ లోని ఇండియన్ నేషనల్ అకాడమీ యొక్క ఫెలోగా ఎంపిక
1961 : శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు (రసాయన శాస్త్రం), ఈ అవార్డును పొందిన మొదటి మహిళ
1975 : పద్మభూషణ్ అవార్డు. ఈ అవార్డు అందుకొన్న మొదటి మహిళా శాస్త్రవేత్త.
1985 : సర్ సి.వి.రామన్ అవార్డు
1989: సర్ అసుతోష్ ముఖర్జీ మెమోరియల్ గోల్డ్ మెడల్
1982 - 1990 : రాజ్యసభ సభ్యులు.