Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎండ, వాతావరణ కాలుష్యం, మీ నిర్లక్ష్యం వెరసి పాదాలు నల్లగా మారిపోతాయి. అవి తిరిగి యథాస్థితికి రావాలంటే.. ఈ చిట్కాలను పాటించండి.
నల్లని చర్మాన్ని తెల్లగా మార్చేటటువంటి సహజమైన బ్లీచ్ నిమ్మకాయ. ఎండకు ఎక్స్పోజ్ అయ్యే కాళ్ళు, చేతులు, పాదాలు, భుజాలు, ముఖాన్ని నిమ్మరసంతో కొద్దిసేపు మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల నల్ల బడ్డ చర్మం తిరిగి పూర్వస్థితికి వస్తుంది.
సాధారణంగా ఇంట్లోని శనగపిండిని చర్మ సంరక్షణకు ఉపయోగిస్తుంటారు. కొద్దిగా శనగపిండిని పసుపుతో కలిపి, పెరుగు, నిమ్మరసం వేసి మెత్తని పేస్ట్లా తయారు చేసుకొని పాదాలకు మాస్క్ లా అప్లై చేయాలి ఇరవై నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. అందమైన ఆరోగ్యమైన పాదాలు మీ సొంతం అవుతాయి.
ప్రతి రోజూ గోరువెచ్చని నూనెతో పాదాలకు మాయిశ్చరైజ్ చేయాలి. హాట్ ఆయిల్ మసాజ్ చర్మానికి తేమనివ్వడమే కాదు.. మృతకణాలను తొలగించడంలో కూడా బాగా పనిచేస్తుంది. ఇంకా పాదాలను శుభ్రపరుస్తుంది.
పాదాలపై మట్టి, మురికి ఎక్కువగా చేరుతుంటాయి. వాటిని వదిలించాలంటే పాలపొడి చాలు. గులాబీనీళ్లలో పాలపొడి కలిపి పాదాలకు పూతలా వేయండి. కాసేపయ్యాక కడిగేస్తే చాలు.
ఎండిన నారింజ తొక్కల పొడికి కాస్త ముల్తానీమట్టి కలిపి నీళ్లతో పూతలా తయారుచేసుకోవాలి. దీన్ని పాదాలకు రాసి ఇరవై నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా వారానికి మూడు సార్లు చేస్తే మంచిది.
చెంచా చొప్పున గంధం పొడి, టొమాటో గుజ్జూ, నిమ్మరసం, కీరదోస రసం తీసుకుని మెత్తగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పాదాలకు రాసి పావు గంట తర్వాత కడిగేయాలి. ఇలా తరచూ చేస్తే పాదాల చర్మం ముడతలు పడకుండా ఉంటుంది.
రెండు చెంచాల చొప్పున శనగపిండి, నీళ్లూ, అరచెంచా నిమ్మరసం, చిటికెడు పసుపు కలపాలి. దీన్ని పాదాలకు పూతలా వేసి పావు గంట తర్వాత కడిగేయాలి.
నిమ్మచెక్కపై కాస్తంత ఉప్పు వేసి పాదాలపై రుద్దాలి. ఇది కూడా పేరుకుపోయిన మ తకణాలను తొలగిస్తుంది. దీంతో పాదాలు అందంగా, మ దువుగా మారతాయి.