Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాదాలు ఎంత అందంగా ఉన్నా వాటి నుంచి వెలువడే దుర్వాసన అంతా భయంకరంగా ఉంటుంది. దాన్ని మాత్రం ఆపలేరు. ఎందుకంటే పాదాలకు చెమట ఎక్కువగా వస్తుంది. దీని వల్ల సహజంగా ఆ ప్రాంతంలో బ్యాక్టీరియా చేరుతుంది. బ్యాక్టీరియా చేరడం వల్ల పాదాల బాగా పగలడం, రక్తం కారడం, కురుపు కావడం వంటి సమస్యలు వస్తాయి. వీటి ద్వారా వెలువడే దుర్వాసనను తొలగించుకోవాలంటే కొన్ని చిట్కాలను పాటించాల్సిందే!
ఒక బకెట్ గోరు వెచ్చటి నీటిలో ఒక కప్పు వెనిగర్ను కలపాలి. ఈ నీటిలో పాదాలను 30 నిమిషాలు ఉంచి తర్వాత శుభ్రంగా స్నానం చేస్తే సరిపోతుంది. ఇలా వారానికి రెండు మార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. వెనిగర్ నుంచి వెలువడే ఆమ్లాలు పాదాల పగుళ్లను, బ్యాక్టీరియాను తొలగిస్తాయి.
ఒక టబ్లో వేడి నీటిని తీసుకొని దాంట్లో మూడు చెంచాల బ్లాక్ టీ ఆకులు వేసి ఉంచాలి. ఆ తర్వాత నీటిలో రెండు పాదాలను 40 నిమిషాల పాటు వేడి నీటిలో ఉంచిన తర్వాత చల్లటి నీటితో కడిగితే సరిపోతుంది. బ్లాక్ టీ చెమట తక్కువగా రావడానికి ఉపయోగపడుతుంది.
ప్రతిరోజు పాదాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. సాన్నం చేసిన వెంటనే మాయిశ్చరైజర్ రాసుకోవడం, పౌడర్ వేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే బయటి నుంచి ఇంటికి రాగానే పాదాలను శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల దుమ్ము కణాలు పాదాలకు అతుక్కోకుండా ఉంటాయి.
కాలివేళ్లకు దుమ్ము పట్టకుండా ఉండాలంటే మాయిశ్చరైజర్ పెట్టుకొని సాక్స్లు వేసుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల బ్యాక్టీరియా దరి చేరకుండా ఉంటుంది. ు