Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహిళలు రాణించని.. రాణించలేని రంగమంటూ ఏదీ లేదు. వాకిట్లో ముగ్గులేసినంత సులభంగా ఫొటోగ్రఫీ రంగంలోనూ తమ సత్తా చాటుతున్నారు. సంపన్నుల అభిరుచిగా భావించే ఫొటోగ్రఫీ ఇండిస్టీలో గ్రామీణ ప్రాంత మహిళలు సైతం కెమెరా చేతపట్టి అద్భుతమైన చిత్రాలను తమ కెమెరాలో బంధిస్తున్నారు. మగవారి అధిపత్యాన్ని సవాల్ చేస్తూ.. సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకుంటున్న వారిలో ఒకరు.. మాదిరెడ్డి శ్రీదేవి. ఖమ్మం జిల్లా ఫోటోగ్రఫీ రంగంలో పరిచయం అవసరం లేని పేరు. తాత, తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన వృత్తిని స్వీకరించి.. గత రెండు దశాబ్దాలుగా కెమెరా చేతపట్టి వైవిధ్యభరితమైన కార్యక్రమాలను కవర్ చేస్తూ.. ఫోటోగ్రాఫర్గా ఉంటూ తనకంటూ గుర్తింపును సాధించుకున్న ఆమె పరిచయం.
శ్రీదేవి తండ్రి సీనియర్ ఫోటోగ్రాఫర్ శ్రీనివాస్ రావు, తాత సీనియర్ ఫోటోగ్రాఫర్ సత్యారావులు ఫోటోగ్రఫీ పైనే ఆధారపడి తమ జీవనం కొనసాగించారు. చిన్నతనం నుంచి కెమెరాల మధ్యన పెరిగిన శ్రీదేవి తాత, తండ్రి నుంచి మెలకువలు నేర్చుకున్నారు. వారి వృత్తి నైపుణ్యాన్ని, పట్టుదలను వారసత్వంగా అందుకుని ఫొటోగ్రఫీలో దూసుకెళ్తున్నారు. 1995 నుండి ఫోటోగ్రఫీ(గీత కలర్ ల్యాబ్) వ త్తిని చేపట్టి అనేక మైలురాళ్ళను ఆమె అధిగమించారు. మగవారి అధిపత్యం ఉండే ఈ ఇండిస్టీలో ఆడపిల్లగా అనేక సవాళ్ళని ఎదుర్కొంటూ ఇతర ఆడపిల్లందరికి ఆదర్శంగా మారారు.
సాంకేతికతను జోడించి...
ఫొటోగ్రఫీ ఇండిస్టీలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సరికొత్త టెక్నాలజీ నేర్చుకుంటూ శ్రీదేవి తన ప్రతిభను మెరుగుపర్చుకుంటున్నారు. తనలోని నైపుణ్యానికి సాంకేతికతను జోడించి.. 2011లో వీడియో మిక్సింగ్ యూనిట్ను తమ ఫొటోస్టూడియోలో నెలకొల్పారు. 2011లో ఖమ్మం జిల్లా ఫోటో, వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ కి ఉపాధ్యక్షురాలిగా ఎన్నికై ఫొటో, వీడియోగ్రాఫర్స్ సంక్షేమం కోసం తనవంతు కృషి చేస్తున్నారు. 2016లో ఖమ్మం జిల్లా ఫోటో, వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా పోటీ చేసి కేవలం ఏడు ఓట్ల తేడాతో ఓడిపోయినా.. సమాజంపై తన బాధ్యతను మరిచిపోలేదు. దాదాపుగా 300మంది ఆడపిల్లలకి ఫోటోగ్రఫీలో ట్రైనింగ్ ఇప్పించి వారందరు తమ జీవితంలో ఆర్థికస్వేచ్ఛతో బతికేలా శిక్షణనిచ్చారు. సమాజంపై తనవంతు బాధ్యతను తెలియజేస్తూ వారందరికీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారు. సేవ చేయాలన్న మనసు ఉన్నవారికి పదవులు అవసరం లేదని నిరూపించారు.
చైతన్యం కలిగిస్తూ...
2015లో ''మై పీపుల్ వెల్ఫెర్ ఆర్గనైజేషన్'' ను సంస్థను స్థాపించిన శ్రీదేవి పలు సామాజిక కార్యక్రమాలతో తనలోని సేవాభావాన్ని చాటుతున్నారు. రాష్ట్రప్రభుత్వం రూపొందించిన హరితహరం కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటూ చిన్న పిల్లలతో మొక్కలు నాటిస్తూ, పర్యావరణంపై అవగాహన కల్పిస్తున్నారు. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేలా దీపావళి పటాసులపై చిన్నారుల్లో చైతన్యం తీసుకువస్తున్నారు. కళాశాల విద్యార్థినిలకు ఆరోగ్యం, వ్యక్తిగత శుభ్రతపై దీబ్్వతీ టశ్రీy పేరుతో అవగాహన పెంపొందిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాల్లో చదువుకునే నిరుపేద ఆడ పిల్లలకు స్కాలర్ షిప్ వచ్చే మార్గాలు వివరిస్తున్నారు. స్త్రవ్ a సతీశీజూ - ర్శీజూ జూశీశ్రీఱశీ అన్న పేరుతో పోలియో పై అవగాహన కార్యక్రమం, ఖమ్మం కార్పోరేషన్ పరిధిలోని డివిజన్ ల్లో అభివ ద్ధిపై ప్రణాళిక - ముఖ్య విశ్లేషకుల కార్యక్రమం, శుభకార్యాలలో మిగిలిన వంటకాలని చెత్తకుండి పాలు చేయకుండా ఆకలితో ఉన్నవారికి అందజేయడం, వృద్ధఆశ్రమాలలో అన్నదాన కార్యక్రమం, ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం, రక్తదానం పై అవగాహన పెంపొందించడం, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం లాంటి పలు సామజిక కార్యక్రమాలు చేపడుతూ విజయవంతంగా ముందుకు వెళ్తున్నారు. ఆమె సేవలకు గాను ఇటీవల Indian Women Summit 2017 వారి ఎక్సలెన్సి అవార్డు అందుకున్నారు.