Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చలికాలంలో ఉష్ణోగ్రత ప్రభావంతో చర్మం ముడతలు పడి నిర్జీవంగా కనిపిస్తుంది. చలి ఎంత ఎక్కువగా ఉంటుందో... ఎండ కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బయటకు వెళ్లే ముందు సన్స్క్రీన్ లోషన్ రాసుకోవడం తప్పని సరి! సన్స్క్రీన్ లోషన్ రాసుకోవడం వల్ల ఎండ నుంచే కాక చలి నుంచి కూడా చర్మాన్ని రక్షించుకోవచ్చు.
వాతావరణ కాలుష్యం వల్ల చర్మం పొడిబారి, నిర్జీవంగా కనిపిస్తుంది. అలాగే అతినీలలోహిత కిరణాల ప్రభావం కూడా చర్మంపై నేరుగా పడటం వల్ల చర్మం పొడిబారడం, పగలడం జరుగుతుంది. ఉష్ణోగ్రతలను, అతినీలలోహిత కిరణాల ప్రభావాన్ని తట్టుకోవాలంటే కచ్చితంగా సన్స్క్రీన్ లోషన్ రాసుకోవాలి.
ఎక్కువ సమయం ఎండలో ఉన్న సూర్యకిరణాల ప్రభావం వల్ల చర్మం త్వరగా ముడతలు పడటం, బాగా పగిలి మంట పుట్టడం వంటివి జరుగుతాయి. దాని నుంచి చర్మాన్ని కాపాడుకోవాలంటే మాయిశ్చరైజర్లు, సన్స్క్రీన్ లోషన్స్ తప్పని సరిగా వాడాలి.
సూర్య కిరణాల ప్రభావం చేతులు, మెడ, ముఖం, పాదాలపై ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గొడుగు లేదా స్కార్ఫ్ కట్టుకోవడం లేదా సన్స్క్రీన్ లోషన్ రాసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలి.
వీటితో పాటు నీళ్లు ఎక్కువగా తాగడం కీలకం. శరీరం డిహైడ్రేట్ అయినా కూడా చర్మం నిర్జీవంగా కనిపిస్తుంది. దాంతో పాటు కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు కచ్చితంగా తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన ఖనిజలవణాలు అందుతాయి. ు