Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొందరికి తరచూ పాదాలు పగులుతుంటాయి. పాదాల చర్మానికి సరిపడినంత తేమ లేకపోవడం వల్ల కూడా పొడిబారి పగులుతుంటాయి. అందుకే తరచూ పాదాలకు నాణ్యమైన మాయిశ్చరైజర్ రాసుకుంటూ ఉండాలి. ఇది పొడిబారకుండా రక్షించి పగలకుండా చేస్తుంది.
అరటబ్బు గోరువెచ్చని నీటిలో కొద్దిగా తేనె వేసి అందులో కాసేపు పాదాల్ని ఉంచాలి. తేనె సహజ మాయిశ్చరైజర్లా పనిచేసి తేమనందిస్తుంది. దీనివల్ల పాదాల్లో పేరుకొన్న మ తకణాలు కూడా పోతాయి.
పాదాలు శుభ్రం చేసుకుని తుడుచుకున్నాక వేళ్లమధ్యలో తడి లేకుండా జాగ్రత్తపడాలి. లేదంటే ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. అది కూడా పొడిబారే సమస్యను పెంచుతుంది.
రెండు టేబుల్స్పూన్ల కొబ్బరినూనెలో చెంచా పసుపు వేసి బాగా కలపాలి. దీన్ని పాదాలకు రాసుకుని బాగా మర్దన చేయాలి. పగుళ్ల సమస్య పోవడమే కాదు, నొప్పి, వాపు ఉన్నా కూడా తగ్గుతాయి. దానికితోడు చర్మం కూడా తాజాగా, మృదువుగా ఉంటుంది.
కొన్నిసార్లు చెప్పుల్లేకుండా నడవడం మంచిదే కానీ.. రోజంతా కాదు. అలా ఒట్టికాళ్లతో నడవడం వల్ల పాదాల్లో మురికీ, బ్యాక్టీరియా చేరుతుంది. అది కూడా పొడిబారి, పగుళ్లకు కారణం అవుతుంది. అందుకే చెప్పులేసుకుని నడవాలి. రాత్రుళ్లు సాక్సులు వేసుకోవడం మంచిది. ఇక, బయటకు వెళ్లేందుకు వేసుకునే చెప్పులు కూడా ఏవి పడితే అవి కాకుండా.. పాదాలకు సౌకర్యంగా ఉన్నవాటికే ప్రాధాన్యం ఇవ్వాలి. పాదాలకు గాలి తగిలేలా చూసుకోవాలి. ఇలా చేస్తే పొడిబారే సమస్య చాలామటుకూ తగ్గుతుంది. పగుళ్ల సమస్యా అదుపులోకి వస్తుంది. ప