Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇటీవలి కాలంలో అందరినీ వేధిస్తున్న సమస్య ఒత్తిడి. దానికి లోనవుతున్నట్లు మీకు ఎప్పుడైనా అనిపిస్తోందా ? ఆరోగ్యం గురించి విపరీతంగా ఆందోళన చెందుతున్నారా ? మీరే కాదు... ప్రపంచంలో అందరూ ఎదుర్కొంటున్న సమస్య ఇది. గత ఐదేండ్లలో ఈ ఒత్తిడి స్థాయి విపరీతంగా పెరిగినట్లు పరిశోధనలు చెబుతున్నాయి. 75 శాతం ప్రజలు నిత్యం విపరీతమైన ఒత్తిడికి గురవుతున్నారు. ఒత్తిడి వల్ల కేవలం మానసిక లక్షణాలైన ఆతురత, కుంగిపోవడం, చిరాకు వంటివే వస్తాయనుకుంటే పొరపాటే. వీటికి తోడు తలనొప్పి, అజీర్తి, బరువు తగ్గడం లేదా పెరగడం, బరువులో అనూహ్య మార్పులు, అలసట వంటి భౌతిక లక్షణాలు కూడా కనపడతాయి. విపరీతమైన ఒత్తిడి వల్ల క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు, వంధ్యత్వం లాంటి రోగాల భారినపడే అవకాశం కూడా ఉంది. ఒత్తిడికి లోనైనప్పుడు దానిని సమర్ధవంతంగా ఎదుర్కొని అధిక మించడం చాలా అవసరం. చాలా మంది ఈ ఒత్తిడిని తగ్గించుకోవడానికి వ్యసనాలకు బానిసలవుతుంటారు. ఈ అలవాట్ల వల్ల ఆరోగ్యం మరింత క్షీనిస్తుంది.
ఒత్తిడిని తగ్గించుకోవడానికి మీరు కొన్ని ప్రకృతి సహజమైన చిట్కా ఇది. ఒక చెంచా పసుపు పొడి, ఒక చెంచా తేన, ఒక చెంచా నిమ్మరసాన్ని గ్లాస్ నీటిలో కలపండి. ఈ మిశ్రమాన్ని రోజుకు ఒకసారి పరిగడుపున తాగితే మంచి ఫలితం ఉంటుంది. పసుపు శరీరంలో ఉన్న కణాలకు శక్తిని ఇచ్చి పోషిస్తాయి మరియు వ్యాధుల పై పోరాడటానికి ఎంతగానో సహాయపడతాయి. పసుపులో ఉండే ప్రతిక్షకారిని మెదడులో ఉండే కణాలను పోషిస్తుంది మరియు ప్రాణవాయువుతో కూడిన రక్తం మెదడుకి అందించడంలో సహాయపడుతుంది. దీనివల్ల ఒత్తిడి చాలా త్వరగా తగ్గుతుంది. నిమ్మరసం లో ఉండే విటమిన్ సి శరీరంలో ఉండే కార్టిసోల్ స్థాయిలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దీని వల్ల ఒత్తిడి తగ్గుముఖం పడుతుంది. దీనికి తోడు ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానం చేస్తూ, నిత్యం వ్యాయామం కూడా చేయాలి. ఇలా చేయడం ద్వారా కూడా సాధారణంగానే మనలో పెరుగుతున్న ఒత్తిడిలను తగ్గించుకోవచ్చు.