Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అన్నం కాస్త మెత్తగా ఉన్నా, పలుకుగా ఉన్నా తినడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. కడుపు నిండా తినాల్సిన అన్నం కాస్త చెడిపోతే వృథా అవుతుంది. అలా కాకుండా అన్నం పొల్లుపొల్లుగా, రుచికరంగా ఉండాలంటే కొన్ని నియమాలను పాటిస్తే సరిపోతుంది.
నీళ్లు-రెండు కప్పులు, బియ్యం-ఒక కప్పు, కాయగూరలు, లవంగం, యాలకులు, ఉప్పు ఉంటే సరిపోతుంది. ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి నానపెట్టుకోవాలి. ఆ తర్వాత గిన్నెలో రెండు కప్పుల నీటిని పోసుకొని స్టవ్ మీద పెట్టాలి. నీరు మరుగుతున్న సమయంలో సగం చెంచా ఉప్పు, నానపెట్టుకున్న బియ్యం వేయాలి. మరింత రుచిగా ఉండాలంటే కొత్తీమీర ఆకులు లేదా పుదీనా ఆకులు, ఒక లవంగం, రెండు యాలకులు, కాయగూర ముక్కలు, చికెన్, మటన్ ముక్కలు వేసుకున్నా సరిపోతుంది. అన్నంలో చిటికెడు ఉప్పు వేసుకోవడం వల్ల అన్నం పొల్లుగా తయారవుతుంది. ఇక పండ్ల ముక్కలను నంజుకొని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. రి