Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మృణాళినీ సారభారు
(11 మే 1918 - 20జనవరి 2016)
విభిన్న నృత్యరీతుల్లో నైపుణ్యం సాధించడంతో పాటు వేలాదిమంది శిష్యులకు భారతీయ సాంప్రదాయ నృత్యకళారీతుల్లో శిక్షణ ఇచ్చిన నృత్యకారిణి, నృత్యదర్శకురాలు, నృత్య గురువు మృణాళినీ సారభారు. అహ్మదాబాద్లో ఆమె నెలకొల్పిన ''దర్పణ అకాడమీ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్'' లో నృత్య రీతులు, నాటకాలు, సంగీతం, పప్పెట్రీలపై వేలాది మంది శిక్షణ పొందుతున్నారు. ఆమె చేసిన కళాసేవలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్నారు.
మృణాలినీ కేరళలో జన్మించారు. ఆమె తండ్రి డా.స్వామినాథన్ మద్రాసు హైకోర్టులో పేరు పొందిన న్యాయవాది. మద్రాసు లా కాలేజీలో ప్రిన్సిపాల్గా పనిచేశారు. ఆమె తల్లి అమ్ము స్వామినాథన్. ప్రముఖ స్వాతంత్య్రసమరయోధురాలు, పార్లమెంట్ మాజీ సభ్యులు, సామాజిక కార్యకర్త. ఆమె సోదరి డా. లక్ష్మీ సెహగల్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ''ఆజాద్ హిందు ఫౌజ్'' లో మహిళావిభాగానికి కమాండర్గా సేవలందించారు. ఆమె సోదరుడు గోవింద స్వామినాథన్ మద్రాసు హైకోర్టులో ప్రముఖ న్యాయవాది. మద్రాసు రాష్ట్ర (తమిళనాడు) అటార్నీ జనరల్ బాధ్యతలు నిర్వహించారు.
ఆమె శాంతి నికేతన్లో రవీంధ్ర నాథ్ ఠాగూర్ మార్గదర్శకత్వంలో విద్యాభ్యాసం చేశారు. యునైటెడ్ స్టేట్స్లో అమెరికన్ అకాడమీ ఆఫ్ డ్రామాటిక్ ఆర్ట్స్లో చేరారు. తర్వాత భారత్కు తిరిగి వచ్చి భరతనాట్యాన్ని ప్రముఖ గురువు మీనాక్షి సుందరం పిళ్ళై వద్ద, తకఘి కుంచు కురూప్ వద్ద కథాకళి నృత్యాన్ని నేర్చుకున్నారు.
ప్రముఖ శాస్త్రవేత్త, అంతరిక్ష కార్యక్రమ పితామహుడు, భౌతిక శాస్త్రవేత్త విక్రం సారభారుతో వివాహం జరిగింది. వారికి ఒక కొడుకు (కార్తికేయ సారభారు), ఒక కుమార్తె మల్లికా సారభారు. మల్లిక తల్లి శిక్షణలో ప్రముఖ నృత్య కళాకారిణిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
మృణాళిని 1948 లో 'దర్పణ' సంస్థను స్థాపించారు. ఆ తర్వాత పారిస్లో ''థియేటర్ నేషనల్ డి చైల్లోట్''లో ప్రదర్శనలు ఇచ్చి మంచి గుర్తింపు పొందారు. ఆమె సుమారు మూడు వందలకు పైగా నాటకాలకు దర్శకత్వం వహించారు. అనేక నవలలు, కవితలు, నాటకాలు, పిల్లల కథలు రాసారు.
మృణాళిని గుజరాత్ రాష్ట్ర హ్యాండీక్రాప్ట్స్ అండ్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ సంస్థకు ఛైర్పర్సన్గా , సర్వోదయ ఇంటర్నేషనల్ ట్రస్ట్కు ట్రస్టీగా కూడా ఉన్నారు. ఆమె జీవిత చరిత్ర ''మృణాలినీ సౌరభారు:ది వాయిస్ ఆఫ్ ద హర్ట్'' గా వెలువడింది.
మృణాళినీ సారభాయి భారతదేశ విశిష్ట పురస్కారం పద్మభూషణ అవార్డును 1992 లో అందుకున్నారు. 1997 లో యు.కె లోని న్యూయాచ్కు చెందిన అంగిలియా విశ్వవిద్యాలయం ఆమెకు గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసింది. ఫ్రెంచ్ ఆర్చివ్స్ ఇంటర్నేషనల్ లిస్ డి లా డాన్సె నుండి డిప్లొమా, మెడల్ అందుకున్న మొదటి వ్యక్తిగా చరిత్రలో నిలిచారు. 1990లో పారిస్లోని ఇంటర్నేషనల్ డాన్స్ కౌన్సిల్ లో ఎగ్జిక్యూటివ్ కమిటీలో నామినేట్ అయ్యారు. 1994లో సంగీత నాటక అకాడమీ పురస్కారాన్ని పొందారు. మెక్సికో ప్రభుత్వం నుండి బంగారు పతకాన్ని పొందారు.
మృణాళిని స్థాపించిన ''దర్పణ అకాడమీ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్' సంస్థ గోల్డెన్ జూబ్లీ వేడుకలు 1998 డిసెంబరు 28న ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సాంప్రదాయక న త్య రంగంలో ''మ ణాళినీ సారభాయి అవార్డ్ ఫర్ క్లాసికల్ ఎక్స్లెన్స్'' అవార్డును ప్రకటించారు. 97ఏండ్ల వయసు(20జనవరి 2016)లో ఆమె మరణించారు. కూతురు మల్లికా సారభారు తల్లి స్థాపించిన డాన్స్ ఇనిస్టిట్యూట్ను విజయవంతంగా నిర్వహిస్తూ.. తల్లి నృత్యవారసత్వాన్ని కొనసాగిస్తున్నారు.