Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సరోజినీ నాయుడు
(13ఫిబ్రవరి, 1879 - 2 మార్చి, 1949)
బెంగాలీల ఆడపడుచు, తెలుగు వారి కోడలిగా ఆమె పేరుగాంచారు. 1908లో మూసీనదికి వరదలు సంభవించినప్పుడు ఆమె చేపట్టిన సేవాకార్యక్రమానికి బ్రిటీష్ ప్రభుత్వం ''కైజార్ ఎ హిందూ'' స్వర్ణపతకాన్ని బహుకరించింది. 19వ శతాబ్దపు చివర్లో హైదరాబాద్ నగర సౌందర్యాన్ని, ఇక్కడి ప్రజల జీవనవిధానాన్ని తెలుసుకోవాలంటే ఆమె కవితలు చదవాల్సిందే. రాజకీయ, సాహిత్య, సామాజిక రంగాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సాధించుకున్న మహిళామణి సరోజినీనాయుడు. భారత కోకిలగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆమె స్వాతంత్య్ర సమరయోధురాలిగా, కవయిత్రిగానే కాదు.. తొలి మహిళా గవర్నరుగా మహిళల ఔన్నత్యాన్ని పెంచారు. మానవ సేవ చేయదలుచుకున్న వారికి మార్గాలనేకం అని నిరూపించిన మహిమాన్వితురాలు.
హైదరాబాద్లో స్థిరపడిన బెంగాలీ బ్రాహ్మణ కుటుంబంలో సరోజిని జన్మించారు. నాంపల్లి రైల్వే స్టేషనుకు సమీపంలోని గోల్డెన్ త్రెషోల్డ్ బంగళాలో వారి నివాసం. తండ్రి డాక్టర్ అఘోరనాథ్ చటోపద్యాయ, తల్లి వరద సుందరి. అఘోరనాథ్ చటోపాధ్యాయ ఎనిమిది భాషల్లో పండితులు. హైదరాబాదు కాలేజికి (నిజాం కాలేజీ)తొలి హెడ్మాస్టర్. వరదాదేవి చక్కని రచయిత్రి. బెంగాలీ భాషలో కావ్యాలు, కథలు రచించారు.
సరోజినికి చిన్నతనం నుంచీ ఇంగ్లీషు అంటే ఎంతో ఇష్టం. 11ఏండ్లకే అనర్గళంగా ఇంగ్లీషు మాట్లాడటంతో పాటు 12ఏండ్లకే మద్రాసు విశ్వవిద్యాలయంలో మెట్రిక్ లేషన్ పూర్తి చేశారు. 13ఏటా ఆమే 13వందల పంక్తుల్లో రచించిన సరోవరరాణి (ూaసy శీట ూaసవ) హృదయాలకు హత్తుకునే శైలిలో ఉంటుంది. ఆమెలోని ప్రతిభను గుర్తింటచన నిజాం నవాబు వివిధ శాస్త్రాలలో పరిశోధన చేసేందుకు ప్రోత్సాహమిస్తూ విదేశాలకు పంపించడంతో పాటు ప్రతి ఏటా స్కాలర్షిప్ ఇచ్చారు.
సరోజినీ లండన్ కింగ్స్ కాలేజీలో, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ అధ్వర్యంలోని గిర్టన్ కాలేజిలోనూ ఉన్నత విద్యను అభ్యసించారు. ఆమె రాసిన కవితలను చదివి ఇంగ్లాండ్ లోని ఆంగ్ల భాషా విమర్శకులు 'ఆర్థర్ సైమన్స్', ఎడ్వర్ గూస్ లు అభినందించారు.
ఆమె రచించిన కావ్యాలలో ''కాలవిహంగం'' (దీఱతీస శీట ్ఱఎవ), ''స్వర్గ ద్వారం'' (ుష్ట్రవ +శీశ్రీసవఅ ుష్ట్రతీవరష్ట్రశీశ్రీస), విరిగిన రెక్కలు (్ష్ట్రవ bతీశీసవఅ షఱఅస్త్రర) చాలా ప్రసిద్ధమైనవి. 1898లో విదేశాలలో విద్య పూర్తి చేసుకుని భారత్కు వచ్చిన ఆమెకు ముత్యాల గోవిందరాజులు నాయుడుతో పెండ్లి జరిగింది.
ఈ వర్ణాంతర పెండ్లిని ప్రముఖ సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు జరిపించారు. వీరికి నలుగురు పిల్లలు. స్వాతంత్య్రపోరాటంలో కొనసాగుతూనే మహిళా విద్యకోసం ప్రత్యేకంగా కృషి చేశారు. 1906లో దేశమంతా తిరిగి సమావేశాలు ఏర్పరచి మహిళల్లో చైతన్యం తీసుకువచ్చారు. 1915లో బొంబాయిలో1916లో లక్నో లో జరిగిన కాంగ్రెస్ సభలలో ఆమె పాల్గొన్నారు. ఊరూరా, వాడవాడలా తిరుగుతూ స్వాతంత్య్ర ప్రభోదం ముమ్మరంగా సాగించారు. 1925 లో కాన్పూర్లో జరిగిన జాతీయ కాంగ్రెస్ మహాసభకు అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహించారు. ఆఫ్రికా, కెనడా, అమెరికా తదితర దేశాల్లో పర్యటిస్తూ పీడిత భారత ప్రజల విముక్తికి ఆమె ప్రయత్నాలు చేశారు.
ఒక భారతీయ మహిళ చేస్తున్న ఉద్యమ ప్రచారానికి బ్రిటిష్ ప్రభుత్వం బెంబేలెత్తిపోయి 23 మే, 1930న ఆమెను అరెస్టు చేసింది. ఎనిమిది నెలల జైలుశిక్ష విధించారు. 1931లో లండన్ రౌండ్ టేబిల్ కాన్ఫరెన్స్కు భారతీయ ప్రతినిధిగా సరోజినీ నాయుడు హజరయ్యారు. క్విట్ ఇండియా ఉద్యమంలో అరెస్టు అయ్యారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఉత్తరప్రదేశ్ గవర్నరుగా సరోజిని నియమించబడ్డారు. హైదరాబాదు లోని గోల్డెన్ త్రెషోల్డ్ పేరుతో గల ఆమె ఇంటిలో హైదరాబాద్ యూనివర్సిటీని నెలకొల్పారు. జీవితమంతా మానవ సేవకు, దేశసేవకూ అంకితం చేసిన ఆమె తన 70ఏటా (1949 మార్చి 2 న)లక్నోలో మరణించారు. ఆమె జ్ఞాపకార్థం భారత ప్రభుత్వం 1964 ఫిబ్రవరి 13న ఒక తపాలబిళ్ళను విడుదల చేసింది.