Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గ్యాస్ ట్రబుల్తో బాధపడే వారు చాలా అరుదుగా కనిపిస్తారు. అసలు ఈ గ్యాస్ ట్రబుల్ ఎలా వస్తుందంటే! కడుపు ఉబ్బరం లేదా కడుపులోని ఆమ్లాలు ఎక్కువగా ఉత్పత్తి కావడం వల్ల కలిగే వ్యాధి. మారిన జీవన శైలి, కదలకుండా ఎక్కువ సమయం పని చేయడం, అధికంగా టీ, కాఫీలు తాగడం, వేళకు సరైన ఆహారం తీసుకోకపోవడం, ఆహారం సరిగ్గా నమిలి మింగకపోవడం, మసాలా దినుసులు ఎక్కువగా తీసుకోవడం, ఒత్తిడి, అలసట, దిగులు, కుంగుబాటుకు లోను కావడం, జీర్ణకోశంలో ఇన్ఫెక్షన్లు వంటివి గ్యాస్ ట్రబుల్ రావడానికి ముఖ్యమైన కారణాలు.
గ్యాస్ ట్రబుల్తో బాధపడేవారు తిన్నది త్వరగా జీర్ణం కాదు. కడుపులో మంట వలన పులుపు, కారం వంటివి ఎక్కువగా తినలేరు. దాంతో పాటు త్రేన్పులు ఎక్కువగా రావడం, మలబద్దకం సమస్య వస్తుంది. కడుపు నొప్పి, అజీర్తి సమస్యలు వెంటాడుతాయి. గ్యాస్ను ఆపుకుంటే కడుపులో నొప్పి పెరుగుతుంది.
గ్యాస్ కు ప్రధాన కారణం ఆహారం సరిగ్గా నమలకపోవడం, కార్బోనేటెడ్ డ్రింక్స్ తాగడం వలన గ్యాస్ సమస్య వస్తుంది. గ్యాస్ సమస్యకు పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. కొన్ని చిట్కాలను పాటిస్తే సరిపోతుంది.
ఒక గ్లాసు గోరు వెచ్చటి పాలలో ఒక చెంచా దాల్చిన చెక్క పొడి, రెండు చెంచాల తేనె ను కలుపుకొని తాగడం వల్ల గ్యాస్ నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.
అలాగే మజ్జిగలో చిటికెడు నల్లఉప్పు, ఒక చెంచా వాము కలుపుకొని తాగాలి, పుదీనా ఆకులను వేడి నీళ్లల్లో వేసుకొని ఆ నీటిని తాగితే గ్యాస్ ట్రబుల్ మాయమవుతుంది.