Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రోజు మనం తీసుకునే ఆహారంలో పండ్లకు సముచిత స్థానం ఇస్తే ఆరోగ్యంతో పాటు అందం సొంతమవుతుంది. ఆరోగ్యం, అందం డబుల్ బెనిఫిట్ కావాలంటే మాత్రం పండ్లను సి విటమిన్ ఎక్కువగా ఉన్న పండ్లును తినాలి. వీటిలో ముఖ్యమైనది ఆరెంజ్.
ఆరెంజ్ తో చర్మ సౌందర్యం చాలా మెరుగ్గా తయారవుతుంది. చర్మంలోని అధికమైన ఆయిల్ తీసివేసే గుణం ఇందులో ఉంది. చర్మానికే కాకుండా మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తుంది. ఎముకల్లో శక్తిని నింపు తుంది. ఇందులోని ఫోలిక్ యాసిడ్, కాల్సియం, విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
ఆరెంజ్ పండ్లే కాదు తొక్కలు కూడా చర్మసౌందర్యానికి ఎంతో ఉపయోగపడుతాయి. శరీరంలో ఉన్న టాక్సిన్లను తొలగించి.. వృధాప్య ఛాయల్ని అరికడతాయి.
పెరుగుతో..
రెండు స్పూన్ల పెరుగులో ఒక స్పూన్ ఆరెంజ్ తొక్కల పొడి వేసి బాగా కలపాలి. దీన్ని ఫేస్ ప్యాక్ గా వేసుకుని.. ఆరేంత వరకూ రబ్ చేయాలి. ఆ తర్వాత 20 నిముషాల పాటు అలాగే ఉంచి..తర్వాత చల్లని నీటితో ముఖం శుభ్రంగా కడుక్కోవాలి.
ఈ ప్యాక్ ముఖంపై ఏర్పడిన మృత చర్మాన్ని పోగొట్టి.. చర్మాన్ని తాజాగా మార్చుతుంది.
తేనె, నిమ్మరసంతో..
ఒక టేబుల్ స్పూన్ తేనె, ఒక టేబుల్ స్పూన్ నిమ్మ రసం, ఒక స్పూన్ ఆరెంజ్ తొక్కల పొడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ గా వేసుకోని ఇరవై నిమిషాల తర్వాత గోరు వెచ్చ ని నీటితో శుభ్రంగా కడగాలి. చర్మం మృదువుగా మారుతుంది.
పసుపుతో..
ఒక టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ తేనె, అరస్పూన్ పసుపు, ఒక స్పూన్ ఆరెంజ్ తొక్కల పొడి తీసుకుని బాగా కలపాలి. ముఖానికి ప్యాక్లా వేసుకోని అరగంట పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో ముఖం కడుక్కోవాలి. చర్మానికి మంచి నిగారింపుగా వస్తుంది. ు