Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సైనా నెహ్వాల్ (17 మార్చి, 1990)
భారతదేశ కీర్తపతాకాన్ని అంతర్జాతీయ క్రీడారంగంలో ఎగురవేసిన వారెందరో ఉన్నారు. వారిలో ఒకరు సైనా నెహ్వాల్. ఒలింపిక్ క్రీడలలో క్వార్టర్ ఫైనల్కు చేరడమే కాకుండా ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్ సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా రికార్డు స ష్టించారు. అనేక అంతర్జాతీయ టోర్నమెంట్లలో విజేతగా నిల్చి దేశానికి వన్నె తీసుకువచ్చారు. ప్రస్తుతం ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ సూపర్ 1000 టోర్నమెంట్- 2018లో ఆమె పాల్గొంటున్నారు.
హర్యానాలోని హిస్సార్లో జన్మించిన సైనా తల్లిదండ్రులిద్దరూ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ సాధించినవారే. చిన్నతనం నుంచే క్రీడలపై ఆసక్తి ఉన్న ఆమెను ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ స్థాపించిన అకాడమిలో చేర్చారు. ఆయన శిక్షణలో నైపుణ్యాన్ని సాధించిన సైనా పలు అంతర్జాతీయ టోర్నమెంట్లలో విజేతగా నిలిచారు.
2006లో ఫిలిప్పీన్స్ ఓపెన్ బ్యాడ్మింటన్ను గెలిచి 4-స్టార్ ఓపెన్ను గెలిచిన తొలి భారతీయురాలిగా రికార్డు స ష్టించారు. దాంతో ప్రపంచం ద ష్టిని సైనా వైపు తిరిగింది.
ఈ పోటీల్లో విజేతగా నిలిచారు. అదే సంవత్సరం దీఔఖీ ప్రపంచ చాంపియన్లో రన్నరప్గా నిలిచారు. 2007లో ఇండియా నేషనల్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో విజయం సాధించి, జాతీయ క్రీడలలో బ్యాడ్మింటన్ స్వర్ణాన్ని గెలుచుకున్నారు.
2008లో ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్ను సాధించి ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా రికార్డు స ష్టించారు. . చైనా మాస్టర్ సూపర్ సీరీస్లో సెమీస్ వరకు వెళ్ళ గలిగారు. ఇండియన్ నేషనల్ బ్యాడ్మింటన్ చాంపియన్షిలో విజేతగా నిలిచి, అదే సంవత్సరం కామన్వెల్త్ యూత్ గేమ్స్లో స్వర్ణపతకం సాధించారు. ప్రపంచ జూనియర్ చాంపియన్ షిప్లో కూడా టైటిల్ సాధించారు. 2008లోనే ఒలింపిక్ క్రీడల లో సైనా నెహ్వాల్ క్వార్టర్ ఫైనల్ చేరుకొని ఇందులోనూ ఈ ఘనత సాధించిన తొలి భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా రికార్డు సృష్టించారు. ఆ తర్వాత వరుసగా ప్రతి ఏడాది పతకాలు అందుకుంటూ 2015 లో ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకు పొందా రు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగామరో రికార్డు సాధించారు. 2015 ఆగస్టులో ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప ్లో రజతపతకం సాధించి.. ఫైనల్స్ వరకు వెళ్ళిన తొలి భారతీయురాలిగా పేరుతెచ్చుకున్నారు.
సైనా నెహ్వాల్ సాధించిన విజయాలకు గుర్తింఫులుగా పలు అవార్డులు లభించాయి. 2009లో అర్జున అవార్డు, 2009-10లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు, 2010లో పద్మశ్రీ పురస్కారం లభించాయి.