Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చాలామంది ఉద్యోగినులు ఇంట్లో చకచకా పనులు చేస్తారు. కానీ ఆఫీసుకు వెళ్లాక ఆరేడు గంటలు కదలకుండానే కూర్చుంటారు. మధ్యాహ్నం భోజనం కూడా ఉన్నచోటే కూర్చుని తినేస్తూ, పనిచేసేస్తుంటారు. ఇది చాలా ప్రమాదం అంటున్నారు నిపుణులు. ఇలా కూర్చున్నచోటు నుంచి కదళకుండా ఉండటంవల్ల శారీరక, మానసిక విశ్రాంతి ఉండదు. ఒత్తిడితోపాటూ అలసట తప్పదు. ఆ ప్రభావం పనిపైనా పడుతుందట.
కూర్చున్నచోటే లంచ్, స్నాక్స్ తీసుకోవడానికి కారణం.. క్యాంటీన్ దాకా వెళ్లితే సమయం వృథా అని. మరి సమయాన్ని మేనేజ్ చేసుకుంటే సరిపోతుంది కదా. మీ రోజు ప్రారంభించే ముందే ఓ ప్రణాళిక తయారు చేసుకోవడం మంచిది. అందులో మీ భోజనానికీ కొంత సమయం పెట్టుకోవడం మరవకండి. మీ కుర్చీలోనే కూర్చోని తినకుండా.. క్యాంటీన్కి సహౌద్యోగులతో కలిసి వెళ్లి సరదాగా భోజనం చేయడం అలవాటుగా మార్చుకోండి. దానివల్ల సత్సంబంధాలు పెరగడమే కాదు, పని ప్రభావం నుంచి బయట పడగలుగుతారు.
సీట్లో ఎంత ఎక్కువ సేపు కూర్చుని ఉంటే... అంత సీరియస్గా పనిచేస్తున్నారని బాస్ అనుకుంటారని చాలా మంది ఫీలింగ్. నిజానికి బాగా పనిచేసేవారు ఎక్కువ సేపు కుర్చీకి అతుక్కుపోరు. కాబట్టి ఎంత పని ఉన్నా సరే.. ప్రతి గంటకోసారి లేచి కనీసం రెండు మూడు నిమిషాలు నడవడం మంచిది. దానివల్ల శరీరానికి కాస్త వ్యాయామం అందినట్లు అవుతుంది. మీకు రిఫ్రెష్ అవుతుంది.
ఎప్పుడో ఓసారి కదలలేనంతా హెక్టిక్ వర్క్ ఉంటుంది. అలాంటప్పుడు కుర్చీలోంచి లేవలేరు. అప్పుడు కుర్చీలో కూర్చున్నా సరే.. పాదాల్ని గుండ్రంగా సవ్య, అపసవ్య దిశలో తిప్పాలి. దానివల్ల కాళ్ల కండరాలు పట్టేసే సమస్య ఎదురుకాదు. అదేవిధంగా చేతుల్ని పైకెత్తడం, మెడను కుడి, ఎడమల వ్కెపునకు తిప్పడం మంచిది. అలాగే కూర్చున్నా, నిల్చున్నా నిటారుగా ఉండేలా చూసుకోవాలి.ు