Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎండలో బాగా తిరిగి వచ్చాక చర్మం చాలా నిగారింపును కోల్పోతుంది. మురికిగా తయారవుతుంది. అలాంటప్పుడు చందనం, పసుపు, పెరుగు లేదా పాలు కలిపి ఆ పేస్టుని ముఖానికి పట్టించాలి. అలా అరగంట సేపు ఉంచాక నీటితో కడిగేసుకోవాలి. ఇలా రోజూ చేస్తే పోయిన నిగారింపు తిరిగి వచ్చేస్తుంది.
- కలబంద గుజ్జులో కాస్త చందనం పొడి కలిపి ఫ్రిజ్లో పెట్టుకోవాలి. ఎండలో నుంచి వచ్చాక ముఖాన్ని ఒకసారి నీళ్లతో కడిగేసుకుని, తరువాత కలబంద, చందనం గుజ్జుని అప్లరు చేసుకోవాలి. ఓ పావుగంట సేపు అలా వదిలేసి తరువాత చల్లటి నీళ్లతో కడిగేయాలి. చక్కని కాంతివంతమైన చర్మం మీ సొంతమవుతుంది.
- చందనం పొడిలో రెండు చెంచాల పాలు కలిపి ముఖానికి రాసుకోవాలి. ఆరాక చల్లటి నీళ్లతో కడిగేసుకుంటే చర్మం తాజాగా అనిపిస్తుంది.
- ముఖంపై మొటిమలు లాంటివి వస్తుంటే వేపాకును ఎండబెట్టి పొడి చేసుకుని డబ్బాలో వేసుకోండి. ఆ పొడిలో కాస్త చందనం పొడి, నీళ్లు కలిపి ముఖానికి, మెడకి పట్టించాలి. దీని వల్ల చర్మంపై మొటిమలకు దారితీసే బ్యాక్టీరియా పోతుంది. మొటిమల సమస్య అదుపులో ఉంటుంది. ముఖం కూడా మంచి కాంతివంతంగా అవుతుంది.
- చందనంపొడి, కాస్త శనగ పిండి, పాలు కలిపి నలుగులా ముఖానికి పట్టించి, బాగా రుద్ది స్నానం చేస్తే ముఖం మీది మృతకణాలు పోతాయి. ు