Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చత్తీస్ఘడ్ పేరు వినగానే గిరిజనులు, ఖనిజ సంపద, ప్రభుత్వం అధికారులు, పెద్ద పెద్ద కంపెనీలు గుర్తుకు వస్తాయి. అక్కడ నివసించే గిరిజనుల జీవితాలను పుస్తకాల్లో చదవడం, సినిమాల్లో చూడటం తప్ప డైరెక్టుగా వెళ్లి పరామర్శించడం అసాధ్యం. ఎందుకంటే వాళ్లు నిత్యం వేధింపులకు గురవుతూనే ఉంటారు. ప్రభుత్వ అధికారులు వారికి ఇచ్చిన హామీలను మరిచిపోతారు. ఇక చదువు, ఆరోగ్యం, విద్య అనేవి వారికి ఆమడ దూరం. అలాంటి సమాజ మార్పును కాంక్షించే వారిలో కొందరైనా ఉంటారని నిరూపించారు చత్తీస్ఘడ్ ఐఎఏస్ ఆఫీసర్... ప్రియాంక శుక్లా. 'చేసే పని మంచిదైతే పది మందికి ఉపయోగపడుతుంది. వారి జీవితానికి, కుటుంబానికి, సమాజానికి కొంత ఆసరాగా నిలుస్తుంది. అంతకన్నా కావాల్సిందేముంది?'
అంటారు శుక్లా.
చత్తీస్ఘడ్లోని జష్పూర్ జిల్లాలో కలెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు ప్రియాంక. ఐఏఎస్లు కావడానికి ముందు చాలా లక్ష్యాలతో ఉంటారు. కానీ ఒక్కసారి ఉద్యోగంలోకి ఎంటరయ్యాక వాటన్నింటినీపక్కకు పెట్టేస్తారు చాలా మంది. కానీ ప్రియాంక గిరిజనుల ఆరోగ్యం, అమ్మాయిల విద్య, భవిష్యత్ గురించి అవగాహన కలిగించడానికి కృషి చేస్తున్నారు. అయితే జిల్లా కలెక్టర్గా ప్రియంక శుక్లా ప్రత్యేకంగా గిరిజనుల కోసం జులై 2016 సంవత్సరంలో 'మిషన్ సంకల్ప్' అనే ప్రాజెక్టును ఎంచుకున్నారు. ఈ ప్రాజెక్టు కింద ఒక ప్రోగ్రామ్ను ఆదివాసీలకు పరిచయం చేశారు. అదేంటంటే 'యశస్వి జష్పూర్' దాని అర్థం 'విజయవంతమైన జష్పూర్' అని. దీని ద్వారా గిరిజన పిల్లలకు ఉన్నత విద్యను అందించడం, ఆరోగ్యం పట్ల అవగాహన కలిగించడం. గిరిజన ప్రాంతాలు చాలా మట్టుకు ప్రాథమిక విద్యకే పరిమితం. అంతకుమించిన పాఠశాలలు అక్కడ ఉండవు. ఈ పరిస్థితి వల్ల చిన్నారుల భవిష్యత్ పాడవుతుందని గుర్తించి పదోవతరగతి నుంచి ఇంటర్మిడియట్ వరకు విద్యను అందించడం మొదలు పెట్టారు. దీని కోసం జిల్లాలో డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ నిధులను వినియోగించారు. ఫౌండేషన్ నిధుల్లో ఏ ఒక్కరూపాయి వృథా చేయకుండా గిరిజన చిన్నారుల విద్య, ఆరోగ్యం కోసం ఖర్చుపెట్టారు. ప్రియాంక శుక్లా చేసిన మంచి పనికి జష్పూర్ జిల్లా లో మంచి ఫలితాలు కనిపించాయి.
'ద న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్' నివేదిక ప్రకారం జష్పూర్ జిల్లాలో దగ్గరదగ్గరగా 51-143 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ప్రియాంక కలెక్టర్గా వచ్చాక జిల్లాలో విద్యార్థుల ప్రతిభ వందకు వందశాతం వచ్చిందని తేలింది. ఇది చత్తీస్ఘఢ్ రాజధాని రాయిపూర్ కు 300 కిలోమీటర్ల దూరంలో ఉంది. మొత్తంగా జిల్లాలో ఆదీవాసి జనాభా 67 శాతం. ప్రయివేట్ స్కూల్స్ కూడా 77 ఉన్నాయి. వాళ్లు వందకు 22 శాతం మాత్రమే పరీక్షల్లో ఉత్తీర్ణలయ్యారు. కానీ జష్పూర్లోని ప్రభుత్వ పాఠశాలల్లో వందకు వందశాతం మార్కులు సాధించారు ఆదీవాసి చిన్నారులు. వారికి కొంత ప్రోత్సాహం, విద్య పట్ల అవగాహన కలిగిస్తే చాలు ప్రతిభ బయటికి వస్తుంది. గిరిజనులకు అందరిలా కనీసం మౌలిక వసతులు కూడా ఉండవు. అయినా వాళ్లకు చదువుకోవాలనే కోరిక ఉంటుంది. దానికి ప్రభుత్వం నుంచి కొంత ప్రోత్సహాం తప్పని సరి. ''ఈ విజయం నా ఒక్కరిది కాదు. అందరి కృషి వాళ్లే ఇంతటి ఫలితాలను సాధించాం. దీని కోసం ఉపాధ్యాయుల ప్రోత్సాహాం, అధికారుల సహకారం, తల్లిదండ్రుల సంకల్పం ఒక్కచోట చేరితే ఇలా విజయం సాధించొచ్చని నిరూపించారు ప్రియంక శుక్లా.
విద్య విషయంలోనే కాదు ఆదీవాసి అమ్మాయిల జీవితాలను కూడా మార్చింది. ఉదాహరణకు ఒక ఘటనను చూద్దాం... జష్పూర్ జిల్లా కన్సబౌల్ పట్టణంలో కొత్తగా ఒక బేకరీని మొదలు పెట్టారు. దాని పేరు 'బేటీ జిందాబాద్ బేకరీ' దీంట్లో 20 మంది అమ్మాయిలు పని చేస్తున్నారు. వారిలో పది మందికి పెండ్లైంది. మీగతా అమ్మాయిలను అక్రమంగా తరలిస్తున్నారనే వార్తను తెలుసుకొని వెంటనే తగిన చర్యలను చేపట్టి నిందుతులకు కఠినమైన శిక్షలను వేయించింది. బేకరీ ద్వారా వారికి ఉపాధి కల్పించింది. ఆదీవాసి అమ్మాయిలకు విద్య లేకపోవడం, సరైన అవగాహన ఉండకపోవడం, బాల్య వివాహాల వల్ల చిన్నవయసులో మానసిక ఒత్తిళ్లను అనుభవింస్తుంటారు. దాన్నుంచి బయట పడాలంటే ప్రతి అమ్మాయికి విద్య, అవగాహన తప్పనిసరి అంటున్నారు ఈ యంగెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ ప్రియంక శుక్లా.