Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రెండుమూడు చెంచాల పెరుగులో కొద్దిగా పసుపు కలపాలి. ఐదు నిమిషాలయ్యాక ఈ మిశ్రమాన్ని చేతులకు రాసి మర్దన చేయాలి. ఇది పూర్తిగా ఆరాక కడిగేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా కనీసం రెండు వారాలు రాసుకొని చూడండి. నలుపు తగ్గుతుంది.
- ఒక పెద్ద పాత్రలో గోరువెచ్చని నీళ్లు తీసుకుని అందులో రెండు నిమ్మకాయల రసం కలపాలి. అందులో ఓ అరగంటపాటు పాదాలు ఉంచాలి. నలుపు సమస్య ఎక్కువగా ఉందనుకుంటే నిమ్మరసాన్ని నీళ్లలో కలపకుండా నేరుగా పాదాలకే రాసుకోవచ్చు. ముఖ్యంగా మోచేతి నలుపు తగ్గించడానికి ఈ చిట్కా పనిచేస్తుంది.
- రెండు చెంచాల కీరా రసంలో, ఒక చెంచా నిమ్మరసం, చిటికెడు పసుపు కలపాలి. దీన్ని చేతులకు పట్టించి, ఆరిపోయాక కడిగేయాలి. దీనికి బదులుగా సమస్య ఉన్న ప్రాంతంలో తాజా కీరదోస ముక్కల్ని కూడా రాసి చూసుకోవచ్చు.
- ముఖం నల్లగా మారితే సెనగపిండి పూత ప్రయత్నించి చూడొచ్చు. రెండు పెద్ద చెంచాల సెనగపిండిలో చిటికెడు పసుపూ, ఒక చెంచా పాలు కలపాలి. చల్లదనం కోసం కొన్ని గులాబీనీళ్లు కూడా వాడొచ్చు. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా వేసుకుని పూర్తిగా ఆరిపోయాక చల్లటి నీళ్లతో కడిగేసుకుంటే చాలు.