Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుప్పెడు పుదీనా ఆకులను మెత్తగా చేసుకుని అందులో చిటికెడు పసుపూ, కొన్ని నీళ్లు కలిపి ముఖానికి పట్టించాలి. ఇది ముఖానికి చల్లదనాన్ని అందిస్తుంది.
- ఎండ వల్ల ముఖం నల్లగా మారితే రెండు చెంచాల చొప్పున బియ్యప్పిండీ, పెరుగు తీసుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. పూర్తిగా ఆరాక కడిగేయాలి. ఈ పూతను కాళ్లూ, చేతులకు కూడా వేసుకోవచ్చు.
- సమపాళ్లలో నిమ్మరసం, తేనె, గుడ్డులోని తెల్లసొన తీసుకుని మిశ్రమంలా కలిపి ముఖానికి రాసుకోవాలి. ఈ పూత వల్ల ముఖంపై పేరుకున్న జిడ్డు తొలగడంతో పాటు చర్మానికి కావాల్సిన పోషణ కూడా అందుతుంది. ఈ పూతల్ని వారానికోసారి వేసుకోవచ్చు.
- మీది జిడ్డు చర్మం అయ్యుండీ, నల్లగా మారితే టొమాటో పూత సరైన ఎంపిక. కాస్తంత టొమాటో రసంలో కొన్ని చుక్కల తేనె కలిపి ముఖానికి బాగా రాసి కాసేపు ఆరనివ్వాలి. ఆ తరువాత చల్లటి నీటితో కడిగేయాలి. ు