Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ రోజుల్లో ఇరవైల్లో ఉన్న అమ్మాయిలు తప్పని సరిగా ఈ కింది పరీక్షలు చేయించుకోవాలంటున్నారు నిపుణులు. ఇంతకీ అవేంటో, ఎప్పుడెప్పుడు చేయించుకోవాలో చూద్దామా.
- పద్దెనిమిదేండ్లు దాటినప్పటి నుంచి ప్రతి రెండేండ్లకోసారి అధిక రక్తపోటు పరీక్ష చేయించుకోవాలి. అలా చేయించుకున్నప్పుడు అది 120/80 ఉంటే.. అధిక రక్తపోటు సమస్య లేదని అర్థం.
- ఇరవై ఏండ్లు వచ్చినప్పటి నుంచి ప్రతి మూడేండ్లకోసారి కొలెస్ట్రాల్ పరీక్షా తప్పనిసరిగా చేయించుకోవాలి. బరువున్నవారు మాత్రం.. ఈ పరీక్ష విషయంలో వైద్యులు చెప్పినట్లుగా చేయించుకోవాలి. ఇది 200ఎంఎల్/డీఎల్ ఉండేలా చూసుకోవాలి.
- లైంగిక జీవితం మొదలుపెట్టిన తరవాత ఏడాది నుంచి పాప్స్మియర్ పరీక్షను తప్పనిసరిగా చేయించుకోవాలి. దానివల్ల గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ని అంచనా వేయొచ్చు. దీన్ని ప్రతి రెండేండ్లకోసారి చేయించుకోవాలి.
- ఇరవై ఏండ్లప్పటి నుంచి ఏడాదికోసారి రొమ్ము పరీక్ష చేయించుకోవాలి. నలభై ఏండ్లు దాటాక మాత్రం మమోగ్రామ్ని చేస్తారు.
- అధిక బరువున్నవారు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన పరీక్ష 'బీఎంఐ'. దీని ఫలితాన్ని బట్టి బరువు ఎంతమేరకు తగ్గాలో సూచిస్తారు వైద్యులు.