Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''పర్యావరణానికి హాని జరుగుతోంది... భవిష్యత్ అంధకారమే'' ఇది అందరి మనసులో ఉన్న బాధ.కానీ దాన్ని సంరక్షించుకోవడానికి అడుగులు వేస్తున్నది మాత్రం కొందరే! వారిలో ముందు వరసలో ఉంటారీ నలుగురు. పర్యావరణ హితం కోసం.. సౌరలాంతర్లు, సౌర పొయ్యిల వాడకాన్ని పెంచుతున్నారు అజైతా! ఇంట్లో చెత్తతోనే సేంద్రియ ఎరువులు తయారు చేస్తున్నారు బెంగళూరుకు చెందిన మృణాల్, సంజనా! పండ్ల మొక్కలు పెంచుతూ పర్యావరణాన్ని సంరక్షిస్తున్నారు రాధిక ఆనంద్! సమాజంలో మార్పు రావాలంటే.. వ్యక్తులు మారాలి. వ్యక్తులుగా వాళ్లు మారి సమాజంలో మార్పు కోసం ప్రయత్నిస్తున్నారీ నలుగురు.
ఇంట్లోనే సేంద్రియ ఎరువులు..
ఇంట్లో చెత్తనంతా ఒకే డస్ట్బిన్లో వేసి పడేస్తుంటాం. కానీ దేనికది వేరు చేసి ఎరువులను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇంట్లో పెంచే మొక్కలకు వాడుకోవచ్చు. ఇలాంటి ఓ యంత్రాన్ని తయారు చేశారు మృణాల్రావ్, అంజనా. దాని పేరు ఆర్బిన్. అంటే డస్ట్బిన్. మృణాల్, అంజనా అయ్యర్లది బెంగళూరు. ఇద్దరికీ పర్యావరణం అంటే ప్రాణం. వంటింట్లో వ్యర్థాలను బయట పడేయడం.. తడి చెత్త, పొడి చెత్త కలిసి పోయి చెడువాసన రావడం... గమనించిన ఈ ఇద్దరు స్నేహితురాళ్లు దానికి ఏదైనా పరిష్కారం చూపించాలనుకున్నారు. అలా వచ్చిందే ఆర్బిన్ తయారీ ఆలోచన. ఈ ఆర్బిన్ అనే యంత్రం సేంద్రియ ఎరువును అందిస్తుంది. అంటే ఇంట్లోనే ఎవరికి వారు చాలా సులువుగా సేంద్రీయ ఎరువును తయారుచేసుకునేలా దీన్ని అందుబాటులోకి తెచ్చారీ స్నేహితురాళ్లు.
సేంద్రీయ వ్యవసాయం చేస్తూ.. ఆర్గానిక్ ఉత్పత్తులు మార్కెట్ చేసే అంజనా అయ్యర్ ఓ పర్యావరణ శాస్త్రవేత్త. ఘనవ్యర్థాలు సద్వినియోగం చేసుకునే అంశంపై మంచి అవగాహన ఉన్న అంజన.. ఇప్పటికే ఇదే అంశంపై ఎన్నో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించింది.
మృణాల్ రావు జీవననైపుణ్యాలు నేర్పే శిక్షకురాలు. తనకు కూడా సేంద్రియ పద్ధతిలో పంటలు పండించడంపై స్పష్టమైన అవగాహన, అనుభవం ఉంది. వీళ్లిద్దరూ చిన్న నాటి స్నేహితులు కావడం.. ఇద్దరి అభిరుచులూ ఒకేలా ఉండటంతో సమాజానికి ఉపయోగపడేలా ఏదయినా చేయాలనుకున్నారు. అలా ఈ యంత్రాన్ని తయారు చేశారు.
ఈ ఆర్బిన్ తయారీకి రెండేళ్లు పట్టింది. పలు సార్లు ప్రయోగం చేయడం విఫలం కావడం.. చివరికి తడి చెత్తలోని తేమని దూరం చేసి.. పొడిగా మార్చడంలోనూ సఫలమయ్యారు. దీన్ని పూర్తిగా ఫైబర్గ్లాస్తో తయారుచేశారు. ఒక్కసారి కొంటే కొన్నేళ్లపాటు దీన్ని వాడొచ్చు. విద్యుత్తు అవసరం లేకుండా పనిచేసేలా దీన్ని రూపొందించారు. ఇందులో దాదాపు రెండుకిలోల వంటింటి వ థాను వేసుకోవచ్చు. ముప్ఫై నుంచి నలభై రోజుల్లో ఇది పొడి ఎరువుగా మారి అడుగున ఉన్న పాత్రలోకి చేరుకుంటుంది. అంటే ఏ ఇబ్బందీ లేకుండా దీన్ని తీసుకుని వాడుకోవచ్చు. ఎలాంటి వంటింటి వ థానయనా ఇందులో వేసుకోవచ్చు. ఇది చూడ్డానికి వాషింగ్ మెషీన్లా ఉంటుంది. ఇందులో రెండురకాల పాత్రలుంటాయి. కుళ్లిన కూరగాయలూ, వాటి తొక్కలూ, టీపొడి, కోడిగుడ్డు పెంకులూ, పువ్వులూ, రాలిన ఆకులు ఇలా ఏవయినా వేసుకోవచ్చు. ఈ యంత్రం వ థా నుంచి తేమను వేరుచేసి.. పొడిగా మారుస్తుంది. అంటే సేంద్రియ ఎరువును అందిస్తుంది. దీన్ని మొక్కల మీద చల్లితే చీడపీడలు తొలగిపోతాయి. ఈ పరికరానికి రెండు చక్రాలు ఉంటాయి. ఎక్కడికైనా సులువుగా కదపొచ్చు. దీని సామర్థ్యం నూట పదిలీటర్లు. ఇది రైతులకు, సేంద్రీయ వ్యవసాయం చేసే వారికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన పేటెంట్ని మ ణాల్ అందుకుంది. వంటింట్లోని చెత్తడబ్బాలో వ థాగా పారేసే చెత్త నుంచి ఎరువు తయారు చేసుకోవడం ప్రతి ఒక్కరికీ సులువుగా తెలియాలనే ఉద్దేశంతోనే దీన్ని అందుబాటులోకి తెచ్చామంటారు ఈ ఇద్దరు.
అమ్మమ్మ మరణంతో...
అజైతా షా... అమెరికా యువతి. ఓసారి రాజస్థాన్లోని తన తాతగారి ఇంటికొచ్చింది. వాళ్లున్న వూరిలో ఓ రోజు రాత్రిపూట వెలుతురు కోసం ఉంచిన కిరోసిన్ దీపం అంటుకుని... ఆ మంటలు ఇల్లంతా వ్యాపించి ఓ అమ్మాయి చనిపోయింది! గ్రామాలకు విద్యుత్ వెలుగులు చేరువకాకపోవడం అజైతా మనసుని ఆలోచనలో పడేసింది. అందుకు తానేమైనా చేయాలనే ఆలోచనతోనే అమెరికా నుంచి భారత్కి 2011లో వచ్చేసింది. ఆమె తల్లిదండ్రులు వ్యాపారం కోసం భారత్ నుంచి అమెరికా వస్తే.. అజైతా ఓ సామాజిక వ్యాపారం కోసం అక్కడి నుంచి సొంతగడ్డకి చేరుకుంది. చక్కటి ఆవిష్కరణలతో పర్యావరణహిత వెలుగులు పంచుతోంది.
పర్యావరణానికి తీవ్ర హాని కలిగించే కిరోసిన్ దీపాలూ, కట్టెల పొయ్యిలకి ప్రత్యామ్నాయంగా ఏమాత్రం కాలుష్యంలేని వస్తువుల్ని స ష్టించాలనుకుంది అజైతా షా. సౌర లాంతర్లూ, పొయ్యి నమూనాల్నీ ఆవిష్కరించింది. వాటి తయారీని ఆయా పల్లెల్లోనే ఉండాలని కోరుకుంది. తద్వారా గ్రామీణులకూ ఉపాధి అవకాశాలు కల్పించింది. ఉత్పత్తీ, పంపిణీ అవసరాల కోసం ఫ్రాంటియర్స్ మార్కెట్ అనే సరికొత్త సంస్థని ప్రారంభించింది. తమ బ్రాండ్కి 'సరళ్ జీవన్' అని పేరుపెట్టింది. కిరాణా దుకాణాల ద్వారా విక్రయాలు మొదలుపెట్టింది. అలా గత రెండేళ్లలో రాజస్థాన్లో లక్షకుపైగా సౌరవిద్యుత్తు ఇన్వర్టర్లూ, పొయ్యిలనూ గ్రామాలకు అందిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో సహా ముప్ఫై జిల్లాల్లో ఈ ఉత్పత్తులు అమ్ముడవుతున్నాయి. అజైతాషాకి లారియల్ ప్యారిస్ సంస్థ పర్యావరణ పరిరక్షణగ్గాను 'విమెన్ ఆఫ్ ది వర్త్' అవార్డు అందించింది. అంతేకాకుండా 'ఇకోయింగ్ గ్రీన్ ఫెల్లోషిప్' కూడా అజైతా షా సొంతం చేసుకుంది.
పండ్ల మొక్కలు పెంచుతూ...
రాధిక ఆనంద్... ఒకటి కాదు రెండు కాదు ఏడాదిలో లక్షా పదివేల పండ్ల మొక్కలు నాటారు. అదీ ఎక్కడో నగరాల్లో కాదు మన దేశ సరిహద్దుల్లో ఉన్న సైనిక స్థావరాల్లో. మొక్కలు నాటడంతోనే ఆమె చేతులు దులిపేసుకోలేదు. వాటి సంరక్షణ కూడా ఆమే చూస్తున్నారు. యాభై రెండేళ్ల రాధిక స్వస్థలం ఢిల్ల్లీ. ఆమె చిన్నతనం నుంచీ పర్యావరణ ప్రేమికురాలు. పుట్టి పెరిగిందంతా సైనిక వాతావరణంలోనే. రాధిక తండ్రి మాజీ సైనికోద్యోగి. ఎప్పటికైనా పర్యావరణానికి మేలు చేసే మంచి పనులు చేస్తూ.. పది మందిని ప్రోత్సహించాలనే ఆలోచన ఉండేది. అయితే చదువూ, పెళ్లీ, పిల్లల బాధ్యతలన్నీ త్వరత్వరగానే పూర్తయ్యాయి. ఆ తరవాత సామాజిక సేవ దిశగా దృష్టి పెట్టారు. 'ప్లాంటాలజీ' పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. దాని ద్వారా పర్యావరణానికి సంబంధించిన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, కేంద్ర పర్యావరణ శాఖ, ఢిల్లీ ప్రభుత్వంతోనూ భాగస్వామి అయ్యారు. కార్పొరేట్ సంస్థలూ, పాఠశాలలూ, ఆసుపత్రుల్లో వర్క్షాపు నిర్వహించి యువతకు పర్యావరణ ప్రాముఖ్యతను వివరించేవారు. పదేళ్లలో ఐదొందలకు పైగా వర్క్షాపులు నిర్వహించారు. ఇక ఏడాది నుంచి సైనిక స్థావరాల్లో పండ్ల మొక్కలు నాటి.. పెంచడం మొదలుపెట్టారు. ఇప్పటి వరకూ రాజస్థాన్, మహారాష్ట్రలోని సైనిక స్థావరాల్లో నాటారు. పండ్ల మొక్కలను మాత్రమే నాటడం ఆమె ప్రత్యేకత. రాధిక నాటిన లక్షా పదివేల మొక్కలేంటంటే.. పనస, బ్లాక్బెర్రీ, చింత, మామిడి.. ఇలా పెద్ద పెద్ద వ క్షాలుగా ఎదిగే వాటిని ఎంచుకున్నారు. నాటిన ప్రతిచోటా మొక్కల బాధ్యతల్ని స్థానిక బంధువులకీ, స్నేహితులకీ అప్పజెప్పారు. ఆర్మీ అధికారులూ కొంత వరకూ వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకున్నారు. ఐదు పదుల వయసులో ఉత్సాహంగా అడుగులు వేస్తున్న రాధిక ఎందరికో ఆదర్శదాయకం.