Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉదయం నిద్రలేస్తూనే గోరువెచ్చని నీటిలోకి నిమ్మరసం, తేనె కలుపుకుని తాగితే మంచిదని అందరికి తెలుసు. కాని దేనికి ఎంత వరకు ప్రాధాన్యం ఇవ్వాలో, ఎలా తాగాలో చాలామందికి తెలియదు.
ఈ ఫార్ములా మంచిదే కదాని కొందరు అధికంగా నిమ్మరసాన్ని వాడుతుంటారు. అలా చేస్తే పులుపుకు పండ్లచిగుళ్లు దెబ్బతింటాయి. సగం నిమ్మపండుకంటే ఎక్కువ వాడకూడదు. నిమ్మకు బరువు తగ్గించే గుణం ఉందికదాని ఎక్కువ వాడితే ఎసిడిటీ వృద్ధి చెందుతుంది. అది చేసే అసలు పనికి ఆటంకం ఏర్పడుతుంది. మోతాదుకు మించి వాడొద్దు. వేడినీళ్లలో నిమ్మరసం కలుపుకుని తాగే ముందు.. మామూలు నీళ్లతో నోటిని రెండుమూడుసార్లు పుక్కిలించిన తర్వాతే తాగాలి. లేదంటే బ్రష్ చేసుకుని తాగితే ఇంకా మంచిది. లేకపోతే నోట్లోని బ్యాక్టీరియా పొట్టలోకి వెళ్లే ప్రమాదం ఉంది. చాలామంది జిమ్, జాగింగ్ వెళ్లినప్పుడు దుకాణాల్లో బాటిళ్లలో నిమ్మరసం తాగుతుంటారు. ఆరోగ్యానికి అది ఏమాత్రం మంచిది కాదు. ఇంట్లోనే సహజమైన నిమ్మకాయలను పిండుకున్న నీటిని తాగితే మంచిది. నీళ్లు, నిమ్మరసంలోకి మోతాదుకు మించి తేనెను కలపకూడదు. కొందరైతే వేడివేడి నీటిలోకి తేనెను కలిపేస్తుంటారు. ఈ అలవాటు ఆరోగ్యకరమైనది కాదు.