Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జ్వరమే కదా అని ఏదో ఒక మాత్ర మింగేసి ఊరుకోకండి. మరీ ఎక్కువ జ్వరం ఉన్నా లేదా మరీ తక్కువ జ్వరం ఉన్నా కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుని సంప్రదించండి. అలాచేయకపోతే రోగి గుండెపోటు లేదా స్ట్రోక్ బారిన పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. లండన్లోని 'ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడిమియాలజీ' కి చెందిన డాక్టర్ ఎలగ్జాండ్రా బృందం నిర్వహించిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. జ్వరం తీవ్రంగా ఉంటే దాని ప్రభావం శరీరంలోని బ్లడ్ క్లాటింగ్ వ్యవస్థపై పడుతుంది. తక్కువ జ్వరం ఉంటే అది రక్తపోటు మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ రెండు సందర్భాలలోనూ మనిషి మృత్యువాత పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధ్యయన కారులు తెలిపారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్, క్రానిక్ అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తొందరగా ఈ ప్రమాదం బారిన పడే అవకాశం ఉంది. ఎందుకంటే వీరిలో రోగనిరోధకశక్తి లేకపోవడంతో తొందరగా ఎక్కువ వేడికి, లేదా ఎక్కువ చల్లదనానికి తట్టుకోలేరు. ఇలాంటి కేసుల్లో ఎక్కువ మరణాలు గుండె సంబంధిత జబ్బుల వల్ల సంభవిస్తున్నాయని తెలుస్తున్నది. అందుకే రిస్కు గ్రూపులను గుర్తించి ఈ ప్రమాదం బారిన పడకుండా ముందే రోగ నిరోధక చర్యలు చేపట్టడం శేయస్కరం అంటున్నారు శాస్త్రవేత్తలు. ు