Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శరీరంలోని ప్రతి కణానికి రక్తప్రసరణ జరిగినప్పుడే శరీరభాగాలన్నీ ఆరోగ్యకరంగా ఉంటాయి. ఏదైనా ఒక భాగానికి, అవయవానికి సరైన రక్తప్రసరణ జరగకపోతే..ఆ భాగం పనిచేయడం మానేసి అనారోగ్యానికి కారణం అవుతుంది. శరీరంలో మెరుగైన రక్తప్రసరణ జరగాలంటే కొన్ని రకాల ఆసనాలు వేయాలి. అందులో ఒకటి త్రికోణాసనం..
త్రికోణాసనం..
నిలబడి చేసే ఆసనాల్లో ఇది ఒకటి. గతంలో చేసిన ఆసనాల మాదిరిగానే ఉన్నా.. కొద్ది తేడాలుంటాయి. ముందుగా నిటారుగా నిలబడాలి. రెండు కాళ్ళ మధ్య వీలైనంత దూరం ఉంచాలి. చేతులను భుజాలకు సమాంతరంగా ఉంచి శ్వాసను తీసుకోవాలి. ఇప్పుడు శ్వాసను వదులుతూ ఎడమవైపు వంగాలి. ఈ స్థితిలో తలపైకి ఎత్తి కుడి చేయిని చూడాలి. ఈ స్థితిలో 30 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత యథాస్థితికి రావాలి. ఇదేవిధంగా కుడివైపు తిరిగి చేయాలి. ఇలా రెండు వైపులకు ఐదు సార్లు చేయాలి.
ఉపయోగాలు..
1. శరీరంలోని కండరాలు, నరాలు బాగా సాగుతాయి.
2. శరీరంలో రక్తప్రసరణ మెరుగవుతుంది.
3. నడుము, తొడ భాగంలో పెరుకుపోయిన అధికకొవ్వు కరుగుతుంది.
4. ఆకర్షణీయమైన శరీరాకృతి సొంతం అవుతుంది.
5.పొట్టభాగంలోని అవయవాలకు రక్తప్రసరణ బాగా జరుగుతుంది.
6. కాళ్లనొప్పులు, పిక్కల నొప్పులతో బాధపడేవారికి ఈ ఆసనం ఎంతో రిలాక్స్ నిస్తుంది.
జాగ్రత్తలు..
శస్త్రచికిత్సలు అయినవారు, ప్రసవం తరువాత నాలుగు నెలల విరామం తీసుకున్న తర్వాతనే ఈ ఆసనాలు వేయాలి.
- శ్రీచందన
డిజె ఫిట్నెస్ హబ్
9666665458