Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేటి యాంత్రిక యుగంలో మనుషుల మధ్య బంధాలు కూడా అంతే యాంత్రికంగా మారిపోతున్నాయి. తల్లిదండ్రులు, పిల్లల మధ్య ఆస్తి తగాదాలు కోర్టుల వరకు వెళ్ళటం కూడా ఇప్పుడు ఏమాత్రం విచిత్రం కాదు. అయితే ఒకటి నిజం. అనుబంధాల మధ్య చీలికలు ఎంతగా వచ్చినా కొన్ని బంధాలు కలకాలం నిలుపుకోవాల్సినవి వుంటాయి. వాటిని నిలబెట్టుకోవడం, అంతకంటే ముఖ్యంగా ఈ విభేదాల మధ్య మనసులు నలిగిపోకుండా కాపాడుకోవటం తప్పనిసరి. మరి వాటిని కాపాడుకోవడం ఎలా..?
దగ్గరివారితో మనస్పర్థలు వచ్చినపుడు వారితో వ్యవహరించడం చాలా కష్టమైన విషయంగా వుంటుంది. వారి మీదున్న ప్రేమాప్యాయతలు, వారితో పెనవేసుకున్న భావోద్వేగాలు మరింత ఇరుకున పెడుతుంటాయి. రకరకాల బావాలు ముప్పిరిగొని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. ఇటువంటపుడు ఎలా ప్రవర్తించాలి అనేది పెద్ద సమస్యగా కనబడుతుంది.
సరిచూసుకోండి : అవతలి వారి పట్ల కోపతాపాల్ని వారు తమని అర్థం చేసుకుని, పూర్వపు బంధం తిరిగి చక్కగా కొనసాగాలనే ఆశా వుంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఎవరి వ్యక్తిత్వం వారు నిలబెట్టుకుంటూ ప్రవర్తించడం కష్టసాధ్య మైన విషయమవుతుంది. అవతలి వారిపై అనవసరపు కోపతాపాలు ప్రదర్శించ కుండా, తాము లేనిపోని అపరాధ భావనకు గురికా కుండా ఉండాలంటే, మాట్లాడుతు న్నపుడు అవతలి వ్యక్తి కండ్లలోకి నేరుగా చూడండి. తలవంచుకోవడం, కండ్లు పక్కకు తిప్పుకోవటం వంటివి చేయకండి. మీ మాటతీరుని కూడా సరిచూసుకోండి. మరీ పెద్దగా లేదా మరీ చిన్నగానూ మాట్లాడకండి.
పదే పదే ఎత్తిచూపకండి : పరస్పర సంభా షణల్లో వ్యక్తిగత దూషణలకు తావివ్వ కండి. ఆయా సందర్భాల్లో అవతలివారి ప్రవర్తన గురించి మాత్రమే మాట్లా డండి. ఇక మీ పట్ల వారి అనుచిత ప్రవర్తనని చెప్పాల్సి వచ్చినపుడు పదిసార్లు నువ్వలా చేసావు. ఇలా చేసావూ అంటూ 'నువ్వు' అనే పదాన్ని ఎక్కువసార్లు ఉపయోగించకండి. అప్పుడు వారి తప్పుల్ని పదేపదే ఎత్తి చూపినట్టు తీవ్రంగా విమర్శించి నట్లవుతుంది. అలాకాకుండా ఆయా సందర్బాల్లో మీరు ఎదుర్కొన్న బాధలమీద, మీ మానసిక వేదన మీద మీ దృష్టిని ఉంచండి. ఆ సందర్భంలో ''నేనింత బాధపడ్డాను. ఆ మాటలు నన్నింత బాధించాయి...'' ఇలా సాగాలి. అంటే ఇదంతా అవతలివారి మీద ద్వేషంతోనో, పగతోనో అంటున్నది కాదు, మీరు ఎదుర్కొన్న అసౌకర్యాన్ని చెప్పడం మాత్రమే అని వారికి అర్థమవ్వాలి.
ఉన్నతంగా ప్రవర్తించండి : ఏ కారణం వల్ల మీ బంధం విచ్ఛిన్నమైనా అందులో మీ పాత్ర ఎంతవరకు ఉందో దానిని అవతలివారికి వివరించడండి. మీ తప్పొప్పుల గురించి మరీ ఎక్కువ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. అది పరోక్షంగా పూర్తి తప్పుని మీమీద వేసుకున్నట్టు అవుతుంది. ఇరువురి మధ్య బంధాన్ని పునరుద్ధరించే సందర్భాల్లో ఉన్నతంగా ప్రవర్తించండి. మన్నించడం ముఖ్యం. ఆయా సంఘటనల వెనుక కారణం ఎవరైనా మీ దృక్పథంలో సానుకూల వైఖరి ఉండాలి.
బాధ్యతల్ని మర్చిపోవద్దు: ఆప్తులతో మీకెంత ఎడబాటు వచ్చినా వారిపట్ల మీరు నిర్వర్తించాల్సిన బాధ్యతల్లో మాత్రం తేడా రానివ్వకండి. ఇతర బంధువుల ద్వారానో, స్నేహితులద్వారానో ఆ బాధ్యతలు నిర్వర్తించండి. మిమ్మల్ని ఎంతగా బాధించినా ఆయా వ్యక్తుల మీద వ్యక్తిగతద్వేషాన్ని పెంచుకోకండి. మిమ్మల్ని బాధించిన సంఘటనలు, అప్పటి వారి ప్రవర్తనని మాత్రమే ఖండించడండి. వ్యక్తుల్ని, వారి పనుల్ని వేరు చేసి చూడడం అలవాటు చేసుకోండి. ఈ మనస్పర్థలు అడ్డుపెట్టుకుని ఎప్పటెప్పటివో తప్పొప్పులు తవ్వాలని ప్రయత్నించకండి. ఇది పలచబడుతున్న బంధాన్ని పూర్తిగా తెంపుతుంది. ఆ సందర్భాన్ని, సంఘటనల్ని మాత్రమే ఎత్తిచూపండి.
పరిశీలించుకోండి : మిమ్మల్ని ఇతరులు నిందిస్తున్నారు అంటే అందుకు కారణాలు ఏమిటి అనేది నిష్పక్షపాతంగా పరిశీలించండి. అవి ఇది వరకటి మీ ప్రవర్తనకు సమాధానాలే అయితే ఇక అక్కడితో మీరు స్పందించకుండా ఆగిపోండి. మళ్లీ మీ నుంచి ప్రతిస్పందన ఉంటే విరోధానికి కొత్త విత్తనాలు చల్లినట్టే. మిమ్మల్ని వారు నిందించారని బాధపడే ముందు ఒక విషయం గమనించండి. కొన్ని విషయాలకు మిమ్మల్ని బాధ్యుల్ని చేసినట్టే, కొన్ని అననుకూల సందర్భాల్ని తామూ ఎదుర్కొన్నట్టు వారు ప్రకటిస్తున్నారు.
క్షమాపణ చెప్పండి : ఏ బంధం కలకాలం నిలవాలన్నా ఒకరి నొకరు అర్థం చేసుకోవడం ఎంత ముఖ్యమో క్షమా గుణం అంతకంటే ముఖ్యమని గ్రహించాలి. ఎందుకంటే చిన్న చిన్న అలకలు, కోపాల నుంచి పెద్ద స్థాయి మానసిక అగాథాల వరకు ఇవన్నీ అన్నీ బంధాల్లోనూ అత్యంత సహజం. వాటిని అలా కొనసాగించడమే పూర్తి అసహజం.